అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం అఖిల్ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన అందాల భామ సయేషా సైగల్. బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ మనవారాలిగా ఇండస్ట్రీకి పరచియం అయిన సయేషా రెండో సినిమాగా బాలీవుడ్ భారీ చిత్రం శివాయలో నటించింది. తొలి ప్రయత్నంలో టాలీవుడ్, బాలీవుడ్లలో చేదు అనుభావాలే ఎదురయ్యాయి. దీంతో సౌత్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన సయేషా ఆర్య హీరోగా తెరకెక్కిన గజనీకాంత్ సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన భలే భలే మొగాడివోయ్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరో ఆర్యతో ప్రేమలో పడిన సయేషా, గత ఏడాది పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత కూడా నటిగా కొనసాగుతూ నటన పట్ల తన ఆసక్తికనబరుస్తోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోని సయేషా, పెళ్లి తరువాత కూడా అలాగే ఉంది. వనమగన్, కాప్పన్ సినిమాల్లో గ్లామర్ రోల్స్లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళ్లో టెడ్డీ, కన్నడలో యువరత్న సినిమాల్లో నటిస్తోంది సయేషా.
తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి తరువాత కూడా థై స్లిట్ డ్రెస్లో హాట్ ఫోజు ఇచ్చిన సయేషా ఫోటోకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొంత మంది పెళ్లి తరువాత కూడా ఇలాంటి స్టిల్స్ ఏంటి అంటూ కామెంట్ చేస్తుంటే.. మరి కొంత మంది సయేషా గ్లామర్కు సలాం చేస్తున్నారు.