టాలీవుడ్ లో కొరటాల శివ  దర్శకత్వంలో నటించిన శ్రీమంతుడు మూవీతో సూపర్ హిట్ అందుకున్న మహేస్ బాబు.. తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ మూవీస్ తో కాస్త నిరాశ పడ్డారు.  మరోసారి కొరటాల శివతో భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.  గత ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాతో మరో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు మహేష్ బాబు.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి కామెడీ ఎంట్రటైన్ మెంట్ తో సూపర్ హిట్ అందుకున్నాడు.  వరుస హిట్స్ అందుకుంటున్న మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో విదేశీ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారు.  అయితే మహేష్ బాబు తదుపరి సినిమా ‘మహర్షి’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన వంశి పైడిపల్లితో ఉంటుందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

 

ఈ నేపథ్యంలో  స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకోమని వంశీ పైడిపల్లికి  చెప్పారట మహేష్ బాబు.   వంశీ పైడిపల్లి అలాగే చేశాడు .. అయితే స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో మహేశ్ ను సంతృప్తి పరచలేకపోయింది. దాంతో తన స్క్రిప్ట్ లో మార్పులు .. చేర్పులు చేయాలని చెప్పాడు. అవన్నీ సరిచేయడానికి వంశీ పైడిపల్లికి చాలా సమయం పడుతుందట. ఈలోగా మరో దర్శకుడితో ఓ మూవీకి కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నారట మహేష్. ఈ నేపథ్యంలో పరశురామ్ ను లైన్లో పెడుతున్నటుగా సమాచారం. పరశురామ్ ఇప్పటికే మహేశ్ కి ఒక కథ చెప్పడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి.  

 

అయితే వంశి పైడిపల్లితో సినిమా చేస్తారని తెలుసుకున్న పరుశరామ్ ఇప్పుడు నాగ చైతన్యతో ‘నాగేశ్వర రావ్’ చేయడానికి సిద్దపడ్డారు.  ఇప్పుడు మహేశ్ బాబు నుంచి కబురు వచ్చేయడంతో, ముందుగా పరశురామ్ ఆ ప్రాజెక్టునే పట్టాలెక్కించనున్నాడని అంటున్నారు.  ఈ మూవీని  మైత్రీవారు నిర్మిస్తారనీ, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తో పరుశరామ్ మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: