మెగా వారసుడిగా టాలీవుడ్‌ గా పరిచయం అయిన యంగ్ హీరో వరుణ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌ నుంచే ప్రయోగాలు చేస్తున్న ఈ యంగ్  హీరో ఇటీవల నెగెటివ్‌ రోల్‌ లో నటించి ఆకట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్‌ సినిమాలో విలన్‌గా నటించాడు వరుణ్ తేజ్‌. ఈ సినిమా ఘన విజయం సాదించటంతో వరుణ్ ఇమేజ్‌ మరో మెట్టు ఎక్కింది. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్‌ లుక్‌ నటనకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. గద్దలకొండ గణేష్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు.

 

సినిమా కోసం కొంత కాలంగా కఠోర శ్రమ చేస్తున్నాడు వరుణ్. ప్రోఫెషనల్‌ బాక్సర్‌ లా కనిపించేందుకు బాక్సింగ్ లెజెండ్స్‌ పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా సోమవారం లాంచనంగా ప్రారంభమైంది. వైజాగ్‌ లో ఈ సినిమా షూటింగ్‌ ను ప్రారంభించారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమాతో టాలీవుడ్‌ లో సరికొత్త సాంప్రదాయాన్ని ప్రాంభించాడు వరుణ్‌. ఈ రోజు షూటింగ్ ప్రారంభిస్తూనే రిలీజ్‌ డేట్‌ కూడా చెప్పేశాడు.

 

సాధారణంగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ మొదలు పెట్టిన రోజే సిరిమా రిలీజ్‌ డేట్‌ ను ప్రకటిస్తారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్‌, నిర్మాణానంతర కార్యక్రమాలు ప్లాన్ చేస్తారు. అయితే తాజాగా అదే సాంప్రదాయాన్ని టాలీవుడ్‌ కు తీసుకువచ్చాడు వరుణ్‌. తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైన రోజు రిలీజ్‌ డేట్‌ ను ప్రకటించాడు. దాదాపు 35 కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్‌, సిద్ధూ ముద్దతో కలిసి  నిర్మిస్తున్నాడు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: