పెళ్లిచూపులు, గీత‌గోవిందం, అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సంచలనం సృష్టించాడు. ఈ మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో విజ‌య్ క్రేజ్ ఒక్క‌సారిగా ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత విజ‌య్ న‌టించిన ట్యాక్సీవాలా యావ‌రేజ్ నోటా ప్లాప్‌.. భారీ అంచ‌నాల‌తో నాలుగు భాష‌ల్లో రిలీజ్ అయిన డియ‌ర్ కామ్రేడ్ డిజాస్ట‌ర్. అక్క‌డ నుంచి విజ‌య్ క్రేజ్‌, కెరీర్ రెండు డౌన్ అవుతూ వ‌చ్చాయి.

 

ఇక తాజాగా విజ‌య్ న‌లుగురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సైతం డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఏకంగా రు. 30 కోట్ల పై చిలుకు ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ కూడా క‌లుపుకుంటే మొత్తం రైట్స్ రు. 40 కోట్ల‌కు అమ్ముడు అయ్యాయి. ఈ మూవీ తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకొంది. దీంతో ఈ మూవీ భారీ నష్టాలను చవిచూసింది. 

 

తొలి వారానికే సినిమాను థియేట‌ర్ల నుంచి ఎత్తేయ‌డంతో దాదాపు 20కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. విజ‌య్ తీరుపై సైతం విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తొలి రోజే భ‌యంక‌ర‌మైన నెగిటివ్ టాక్ రావ‌డంతో ఇప్ప‌టికే చాలా చోట్ల ఈ సినిమాను తీసేసి నితిన్ ‘భీష్మ’ మూవీని ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ సినిమా తీసిన సీనియ‌ర్ నిర్మాత కేఎస్‌. రామారావు భారీగా న‌ష్ట‌పోయారు. ఇక సినిమా కొన్న డిస్ట్రిబ్యూట‌ర్లు అంతా తమకు తిరిగి డబ్బులు చెల్లించాలని నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారు. 

 

ఈ న‌ష్టాన్ని వ‌చ్చే సినిమాతో క‌వ‌ర్ చేస్తాన‌ని చెపుతున్నా వాళ్లు విన‌డం లేద‌ట‌. దీంతో ఈ విష‌యం తెలుసుకున్న హీరో విజ‌య్ తాను తీసుకున్న రెమ్యున‌రేష‌న్‌లో స‌గం వెన‌క్కు ఇస్తాన‌ని నిర్మాత‌తో అన్న‌ట్టు గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. అయితే భారీ మొత్తంలో వచ్చిన నష్టాన్ని నిర్మాత ఎలా పూరిస్తాడో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: