ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా బిజీ అవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం వరుసగా ఆయన సినిమాలను ఓకే చేస్తున్నారు. పింక్ సినిమా రీమేక్ చేస్తున్న ఆయన... క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో షూటింగ్ కి వెళ్ళడానికి సిద్దమవుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. పింక్ సినిమాను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుసగా సినిమాలను ఓకే చేస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరో ప్లాన్ చేసాడు.

 

ఒక సినిమాను సీక్వెల్ గా చెయ్యాలని చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఓ మై గాడ్ రీమేక్ చిత్రం గోపాల గోపాల పేరుతో తెలుగులో చేసారు. డాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా సీక్వెల్ కి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు. డాలీ తో పవన్ చేసిన కాటమరాయుడు సినిమా ఫ్లాప్ అయింది. అయినా సరే పవన్ ని ఎలా చూపించాలో అలా చూపించాడు. దీనితో ఇప్పుడు మళ్ళీ డాలీ తో సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు. 

 

ఈ సినిమాను మే తర్వాత సెట్స్ మీదకు తీసుకువెళ్ళే ఆలోచన చేస్తున్నాడు. ఇలా చేస్తే గనుక రీమేక్ సినిమాలను సీక్వెల్ తీయడం అనేది పవన్ కి ఇది మొదటి సారి కాదు. హిందీ 'దబంగ్'కీ తెలుగు రీమేక్ గా 'గబ్బర్ సింగ్' తీశారు. సూపర్ హిట్టయింది. కానీ, 'గబ్బర్ సింగ్' సీక్వెల్ గా వచ్చిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' ఘోరంగా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం దీనిపై అనేక రూమర్లు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా నిర్మాతగా మైత్రీ మూవీ మేకర్స్ ఉంటుంది అంటున్నారు. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: