ఈ ఏడాది సంక్రాంతి కానుకనగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ హిట్ అయ్యింది.  ఈ సినిమా రిలీజ్ కి ముందు సామ జవరగమన, రాములో రాములా సాంగ్స్ సోషల్ మీడియాలో ఓ కొత్త రికార్డులు సృష్టించాయి.  ఒకదశలో ఈ మూవీకి రెండు పాఠలు ప్రాణం పోశాయి అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సామజవర గమన సాంగ్ అయితే కోట్ల వ్యూస్ సంపాదించింది.  ఇదే సమయంలో మహేష్ బాబు నటించిన  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది.  కానీ ఈ మూవీ మ్యూజికల్ పరంగా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.  దాంతో ఇప్పుడు ప్రతి హీరో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

 

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి వకీల్ సాబ్, లాయర్ సాబ్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్ర అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఈ నేపథ్యంలో పవన్ కి తమన్ తాను ఎలాంటి సాంగ్స్ ఇవ్వబోతున్నాడో ముందే వివరించేందుకు సిద్దం అవుతున్నట్టు తెలుస్తుంది.  ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని కలసిన తర్వాత తమన్ ఓ సంతోషకరమైన విషయం చెప్పారు. పవన్ ని కలసిన తమన్ ఎంతో ఎమోషన్ అయినట్లు తెలుస్తుంది.

 

ఇది అద్భుతమైన రోజు. నేను కలవాలని, ఆయన సినిమాకు సంగీతం అందించాలని కలలు కన్న వ్యక్తిని కలిశాను.  నేను కంపోజ్ చేసిన పాటలని ఆయనకు వినిపించాను. ఆ సమయంలో ఎలా రియాక్షన్ ఇవ్వబోతారని చాలా టెన్షన్ పడ్డాను.. ఆ సమయంలో పవన్ గారు నా వైపు చూసి చాలా సంతోషించారు.  ఆయన చూపించిన ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేని అన్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ తో రాబోతున్నాం  అని తమన్ ప్రకటించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: