టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల ప్లానింగ్ తెలిసిందే. సినిమా అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకోవడం.. ఆ వెంటనే షూటింగ్ మొదలుపెట్టడం మహేశ్ కు అలవాటు. ఈ గ్యాప్ లో కొత్త కథలు వినటం కూడా మహేశ్ కు అలవాటు. కథ నచ్చితే పూర్తి స్క్రిప్ట్ తో రావాలని చెప్పడం.. వారిని లైన్ లో పెట్టుకోవడం చేస్తూంటాడు. దీంతో కమిట్ మెంట్ ను బట్టి సినిమాలు చేస్తూంటాడు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు తర్వాత గ్యాప్ తీసుకున్న మహేశ్ వంశీ పైడిపల్లి సినిమాలో చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్ లో ఓ యువ దర్శకుడు చెప్పిన కథను మహేశ్ విన్నాడని తెలుస్తోంది.

 

 

గుంటూరు టాకీస్, సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా గరుడ వేగ వంటి హిట్ ఫిల్మ్ తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు ఓ కొత్త కాన్సెప్ట్ తో మహేశ్ కు కథ వినిపించాడని ఫిలింనగర్ లో ఓ వార్త జోరుగా షికారు చేస్తోంది. ప్రవీణ్ చెప్పిన కథకు మహేశ్ ఇంప్రెస్ అయ్యాడని అంటున్నారు. కథ నచ్చడంతో కొద్దిపాటి మార్పులు కూడా చెప్పాడని సమాచారం. ప్రవీణ్ మేకింగ్, స్క్రీన్ ప్లే, టేకింగ్ తో గరుడ వేగను ఏ విధంగా హిట్ సినిమాగా మలిచాడో తెలిసిన విషయమే. హిట్ అనే మాటే మర్చిపోయిన రాజశేఖర్ కు ఆ సినిమా ద్వారా హిట్ లభించింది.

 

 

ప్రస్తుతం మహేశ్ కు ప్రవీణ్ చెప్పిన కథ నచ్చడానికి కారణం ఓ మంచి పాయింట్ తో వెళ్లడమే అంటున్నారు. మహేశ్ ను ఇంప్రెస్ చేశాడంటే ప్రవీణ్ కు ఖచ్చితంగా అవకాశం దక్కినట్టే. కాకపోతే బౌండెడ్ స్క్రిప్ట్ తో వచ్చాక మాత్రం మహేశ్ కు నచ్చాల్సిందే. ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: