ఇటీవల తన క్యాలెండర్ ఫోటోషూట్ 25 వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త ఫోటోలను రిలీజ్ చేశాడు ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని. అయితే ఈ ఫోటో షూట్ కొన్ని బోల్డ్ ఫోటో గ్రాఫ్లు కూడా ఉన్నాయి. ఆడియన్స్లో అటెన్షన్ క్రియేట్ చేసి ఆ ఫోటోలు కాపీ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా కియారా న్యూడ్ స్టిల్ వివాదాస్పద మైంది. ఓ హాలీవుడ్ స్టిల్ ఫోటోగ్రాఫర్, కియారా స్టిల్కు తాను తీసిన ఫోటోకు పోలికలున్నాయంటూ ఆరోపించాడు. అయితే డబూ అది హాలీవుడ్ ఫోటోగ్రాఫర్ స్టిల్కు కాపీ కాదు, గతంలో తాను తీసిన ఫోటోకే కాపీ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
తాజాగా డబూ క్యాలెండర్లోని మరో ఫోటోపై కూడా కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్లో కండల వీరుడు జాన్ అబ్రహంతో ఓ ఫోటోను తీశాడు. ఆ ఫోటోలో జాన్ కేవలం ఒంటి మీద జారిపోతున్న ఓ టవల్తోనే కనిపించాడు. అయితే ఈ స్టిల్ కూడా కాపీ అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఇలాంటి ఫోటోనే దిగాడు. అంతేకాదు హాలీవుడ్ యాక్టర్ ఆంటోనియో కూడా ఇలాంటి స్టిల్లే ఇచ్చాడు. దీంతో మరోసారి డబూపై కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డైట్ సబ్య అనే సంస్థ ఇంది గందీ కాపీ (చెడ్డ కాపీ) అంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజెన్లు డబూపై విరుచుకుపడుతున్నారు. క్రియేటివిటీని కూడా కాపీ చేస్తారా అంటూ ఘూటుగా స్పందిస్తున్నారు. మరి ఈ ఆరోపణలపై ఈ డబూ ఎలా స్పందిస్తాడో చూడాలి.
View this post on InstagramTowel series déjà Vu? YES or NO? 😬😝😫🤐 . . #dietsabya #gandi #copy #towelseries