కొత్త బంగారు లోకంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయిన అందాల భామ శ్వేతా బసు ప్రసాద్. తొలి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తరువాత ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో వన్ మూవీ వండర్గా మిగిలిపోయింది శ్వేతా. తరువాత అవకాశాలు లేక బోల్డ్ క్యారెక్టర్స్కు ఓకె చెప్పిన ఈ బ్యూటీ లుక్స్ పరంగానూ నిరాశపరిచింది. దీంతో క్రమంగా సినిమాకలు దూరమైంది.
హిందీలో అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అక్కడ కూడా ఈ భామ ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో కొన్ని వివాదాల్లో చిక్కుకొని పూర్తిగా సినీ రంగానికి దూరమైంది. అదే సమయంలో యంగ్ డైరెక్టర్ రోహిత్ మిట్టల్ను ప్రేమించిపెళ్లి చూసుకుంది. అయితే శ్వేత వివాహబంధం కూడా అంత సక్సెస్ఫుల్గా కొనసాగలేదు. పెళ్లి చేసుకున్న ఏడాది లోపే ఈ జంట విడాకులు తీసుకున్నారు.
2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న శ్వేత బసు, రోహిత్ మిట్టల్లు ఏడాది తిరిగి లోపు విడిపోయారు. అయితే భర్తతో విడిపోయిన బాధ శ్వేతలో పెద్దగా కనిపించటం లేదు. భర్త నుంచి విడిపోయిన కొద్ది రోజులకే బీచ్లో బికినీలో సందడి చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో నటిస్తున్న శ్వేతాబసు ప్రసాద్ హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది.