ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న సినిమా భీష్మ. నితిన్ హీరోగా గోల్డెన్ లెగ్ హీరోయిన్ రష్మిక జంటగా నటించిన ఈ సినిమా నితిన్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ మూవీగా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. వీకెండ్ తో పాటు సోమవారం కూడా భీష్మ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయంటే సినిమా హిట్ స్థాయి అర్ధం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తూ లాభాల బాట పయనిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కు చేరుకుందని టాక్. ఇంతగా సక్సెస్ అయిన సినిమాపై హైదరాబాద్ లో పోలిస్ కేసు నమోదైంది.

 

 

భీష్మ సినిమా యూనిట్ పై తెలంగాణ గంగపుత్ర వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ లోని మలక్ పేట పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సినిమాలో హీరోను లవర్ బాయ్ గా చూపిస్తూ భీష్మ అనే టైటిల్ పెట్టినందుకు హీరో నితిన్, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, దర్శకుడు వెంకీ కుడుముల, ఎడిటర్ నవీన్ నూలిపై వారు ఫిర్యాదు చేశారు. భీష్మ అనే టైటిల్ పెట్టడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. మహాభారతంతో భీష్ముడికి ఎంత ఉన్నతి ఉంటుందో తెలిసీ కూడా సినిమాలో హీరోకు ఆ పేరు పెట్టడం తగదని వారు అంటున్నారు.  

 

 

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దీనిపై విచారణ చేస్తామంటున్నారు. భీష్మ సినిమా విడుదలకు ముందు బీజేపీ నాయకులు కూడా ఈ టైటిల్ మార్చాలంటూ పట్టుబట్టారు. అవాంతరాలన్నీ తొలగి సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది కూడా. యూనిట్ సంబరాలు చేసుకుంటున్న వేళ ఇప్పుడు మరో వివాదం రాజుకుంటోంది. గతంలో కొన్ని సినిమాల విడుదలకు ముందు అనేక వివాదాలు వచ్చాయి. మరి భీష్మ యూనిట్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: