టాలీవుడ్ హీరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు చిరంజీవి .. ఎందుకంటే స్వయం కృషితో పైకొచ్చిన వారిలో ముఖ్యంగా పేరు చిరంజీవిఒక్కడే .. మామూలు  సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తనకంటూ ప్రత్యేక స్తానాన్ని సంపాదించుకున్నాదు.. చిరంజీవివి సినిమా ఇప్పుడు రానుందంటే హంగామా మాములుగా ఉందన్న విషయం తెలిసిందే.. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరో చిరంజీవిని ఇంస్ప్రెషన్ గా తీసుకున్నారంటే అతి శయోక్తి లేదనే చెప్పాలి. 

 


ఇకపోతే ఈ మధ్య చిరు, మహేష్ బాబు సినిమా రానుందని వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అసలు విషయమేంటంటే..దర్శకుడు శ్రీను వైట్లకు టాలీవుడ్‌లో బ్యాడ్ టైం నడుస్తోంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఈ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుషా ఆయనే ఊహించి ఉండరు. అయితే ఊహించుకున్నదే జరిగితే అది అని లైఫ్ ఎందుకు అవుతుంది. అందులోనూ రంగుల ప్రపంచంలో అది చచ్చినా కుదరదు. 

 


సినిమా రంగంలో ఇప్పటిలో హిట్ కొట్టినోడే హీరో.. ఫ్లాప్ పడిందంటే ఎంత పెద్ద దర్శకుడికైనా డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టే. ఇలా గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్‌లతో పాపం శ్రీను వైట్ల దెబ్బ మీద దెబ్బ తింటూనే ఉన్నారు.శ్రీనువైట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబులను కలిశారని.. ఇద్దరికీ తన వద్ద ఉన్న కథలను వినిపించినట్టు తెలుస్తోంది. 

 

 

గతంలో మహేష్ బాబుకి దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీనువైట్ల.. దూకుడు 2 రేంజ్‌లో కథను తయారుచేసి వినిపించినట్టు సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం శ్రీను వైట్ల కథ విని హోల్డ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చిరు, మహేష్ కాంబోలో మల్టీస్టారర్ కథను శ్రీనువైట్ల రెడీ చేశారని.. ఆ కథే ఇద్దరికీ చెప్పారనే టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకూ నిజమో తెలియదు కాని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు స్టార్లు శ్రీనువైట్లతో సినిమా చేసే ప్రయోగం చేయడం అనుమానంగానే ఉంది. మరి ఈ సినిమా కథ ముందుకు నడుస్తుందా లేక కంచికి చేరుతుందా అనే విషయాలు త్వరలోనే వెలువడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: