హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలతో మంచి జోరు మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా విషయంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో కుటుంబంతో కలిసి మొన్న న్యూయార్క్ నగరం వెళ్లిన మహేష్ ఇటీవల తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ సమయంలో వంశీ పైడిపల్లితో సినిమా ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల తాజాగా వంశీ పైడిపల్లి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యే ముందు ఒక్కసారిగా ఆ ప్రాజెక్టుని మహేష్ బాబు క్యాన్సల్ చేయడం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

అయితే వంశీ పైడిపల్లి సినిమా అంతా ఓకే అనుకున్న టైంలో పక్కన పెట్టడం గల కారణం చూస్తే స్క్రిప్టు పరంగా సెకండాఫ్ సరిగ్గా లేకపోవడంతో మహేష్ వెంటనే ఆ ప్రాజెక్టు ఆపేయటం జరిగినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ఇటువంటి సమయంలో వెంటనే గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం తో మహేష్ ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో మరి కొంతమంది డైరెక్టర్ పేర్లు వినపడ్డాయి. వీరిలో వరస ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల పేరు కూడా ఉంది.

 

గతంలో మహేష్ బాబు తో 'దూకుడు' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత 'ఆగడు' సినిమాతో భారీ డిజాస్టర్ ఇవ్వటం జరిగింది. ఆ తరువాత డైరెక్టర్ శ్రీను వైట్ల చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అయ్యాయి. ఇటువంటి సమయంలో డైరెక్టర్ శ్రీను వైట్ల తో మహేష్ చేస్తున్నట్లు సినిమా స్క్రిప్ట్ అంతా ఓకే అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్తలు విన్న మహేష్ అభిమానులు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అన్నా శ్రీనువైట్లతో సినిమా వద్దని కెరియర్ మంచి టైమింగ్ లో ఉంది ఇటువంటి టైం లో ఎక్స్పరిమెంట్లు వద్దన్నా అంటూ మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: