మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా గురించి ప్రతి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కొరటాల శివ తన సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు. మొదటి సినిమా మిర్చి మొదలుకుని, భరత్ అనే నేను వరకు అదే మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అందువల్ల మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో కూడా ఏదో స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుందని భావిస్తున్నారు.

 

 

ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ గా కనిపించనున్నాడట. ఇటీవల ఈ చిత్రం నుండి చిరంజీవి లుక్ బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ లీకేజీల వల్ల ఇబ్బంది సినీ ఇండస్ట్రీ తాజాగా మెగాస్టార్ లుక్ బయటపడడంతో అవాక్కైంది. పెద్ద పెద్ద సినిమాల నుండే లీకేజీలు జరిగితే చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానం అందరిలో కలుగుతుంది.

 

 


అయితే ఇకముందు ఇలాంటి లీకేజీలు జరగకుండా జాగ్రత్త పడతామని చిత్రబృందం భావిస్తోంది. అందుకు తగిన విధంగా సెక్యూరిటీని టైట్ చేయాలని భావిస్తున్నారు. సెట్లో మొబైల్ లాంటివి వాడకూడదనే నియమం ఉన్నా కూడా ఇలాంటి లీకేజి జరగడానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఇక నుండి షూటింగ్ ప్లేస్ కి మొబైల్ తీసుకురావద్దని గట్టి కండిషన్ పెడుతున్నారట. సెట్లో పనిచేసే వాళ్లే కాదు పెద్ద టెక్నిషియన్లు సైతం మొబైల్స్ వాడకూడదని కండిషన్ పెడుతున్నారట.

 

 

మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నందున ఇకపైనా ఇలాంటి లీకేజీలు జరగవని అనుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ టీం కూడా సెక్యూరిటీ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అయినా కూడా లీకేజీలను అరికట్టలేకపోయింది. మరి వీళ్ళైనా ఈ విషయంలో సక్సెస్ అవుతారెమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: