ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మహాసముద్రం స్క్రిప్ట్ తో ఎంతో మంది హీరోల వద్దకి తిరిగాడు. ఆర్ ఎక్స్ ౧౦౦ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా తన తర్వాతి సినిమా చేయలేకపోయాడు అజయ్. తన వద్ద ఉన్న మహాసముద్రం స్క్రిప్ట్ ని అందరు హీరోలకి వినిపిస్తూనే ఉన్నాడు. సినిమా కథని అందరూ మెచ్చుకుంటూనే ఉన్నారు. కానీ ఎవరి దగ్గరా సినిమా చేయడానికి టైమ్ లేదు.

 

 

మొదటగా రవితేజసినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ సడెన్ గా రవితేజసినిమా చేయట్లేదని చెప్పడంతో అజయ్ భూపతి కొంచెం పరుషంగా రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ శర్వానంద్ ని చేరుకుంది. శర్వానంద్ అప్పటికే రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తన డేత్స్ ఇవ్వలేకపోయాడు. ఇక చివరగా నాగచైతన్య వద్దకి చేరింది. మహా సముద్రం కథ విన్న చైతన్య సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాడు. కానీ ఒక సంవత్సరం వరకు ఆగాలని కోరాడట.

 

 

శేఖర్ కమ్ములతో చేస్తున్న లవ్ స్టోరీ పూర్తయితే గీతగోవిందం పరశురామ్ తో సినిమా మొదలవుతుందని, ఆ సినిమా పూర్తయ్యాక మహాసముద్రం చేద్దామని చెప్పాడట. అజయ్ దానికి అంగీకరించలేదని సమాచారం. దాంతో ఈ సినిమా మళ్ళీ వేరే హీరో దగ్గరికి వెళ్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ చైతన్య ఈ సినిమాని ఓకే చేసేలా కనబడుతున్నాడు. ఎందుకంటే పరశురామ్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో చైతన్య అజయ్ సినిమా చేయాలని బావిస్తున్నాడట.

 

 


మహేష్ బాబుతో పరశురామ్ సినిమా స్టార్ట్ అయితే చైతన్య తర్వాతి చిత్రం ఎవరితో ఉంటుందనేది క్లారిటీ లేదు. అందువల్ల ఆ గ్యాప్ లో అజయ్ మహాసముద్రం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. మరి చర్చలు జరిగి ఈ సారైనా మహాసముద్రం సెట్స్ మీదకి వెళితే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: