సినిమా జనాల గురించి ఏదైనా చిన్న ప్రచారం జరిగినా సరే సోషల్ మీడియాలో కొంత మంది చేసే హడావుడి అంతా ఇంతా కాదు. దాని వలన వాళ్ళు ఇబ్బంది పడతారు లేదు అనేది కనీసం చూడరు. తాజాగా హీరోయిన్ మేహరీన్ విషయంలో ఇదే జరిగింది. ఆమె హీరోయిన్ గా నటించిన ‘అశ్వథ్థామ’ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ఓ ముఖ్యమైన ఇంటర్వ్యూకి మెహరీన్ హాజరు కానప్పటికీ ఆమె హోటల్ బిల్స్ను తామె కట్టామని ‘అశ్వథ్థామ’ చిత్ర నిర్మాత చెప్పారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమె స్పందించింది.
“అశ్వథ్థామ సినిమా విషయంలో నా గురించి గత కొన్నిరోజులుగా పలు వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఆ వివాదం గురించి నేను మాట్లాడకూడదనుకుని ఇన్ని రోజులు చాలా సైలెంట్గా ఉన్నాను. కానీ నా మర్యాదకు భంగం కలుగుతున్న తరుణంలో తప్పక స్పందించాల్సి వస్తోంది. సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ పూర్తి కాగానే కుటుంబసభ్యులతో గడిపేందుకు నేను పంజాబ్ వెళ్లాను. తర్వాత ‘అశ్వథ్థామ’ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చాను. కాకపోతే అదే సమయంలో మా తాతకు గుండెపోటు వచ్చింది.
అయితే ఆ సమయంలో జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో నాగశౌర్య సైతం ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత నేను ‘అశ్వథ్థామ’ ప్రమోషన్స్ అన్నింటిలోనూ భాగమయ్యాను. కాకపోతే స్కిన్ ఎలర్జీ రావడం వల్ల ఒక ఇంటర్వ్యూకి మాత్రం హాజరుకాలేకపోయాను. దీంతో నిర్మాత నా హోటల్ బిల్స్ కట్టనని చెప్పడం... తర్వాత నేను చెప్పడంతో నా మేనేజర్ బిల్స్ పే చేయడం జరిగింది. తెలుగులో నేను 14 సినిమాల్లో నటించాను. కానీ ఇప్పటివరకూ ఏ నిర్మాణ సంస్థతోనూ ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదు. నా వృత్తిపరమైన జీవితానికి భంగం కలుగుతున్నప్పుడు ఈ వివాదంపై స్పందించక తప్పలేదు. ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలేయాలని అనుకుంటున్నాను అని చెప్పింది ఆమె.