బోయపాటి శ్రీను సినిమాకోసం బాలకృష్ణ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. మార్చిలో సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమాలో అంజలితో కలిసి బాలయ్య రీమిక్స్ సాంగ్ లో చిందులేయబోతున్నాడు. రీమిక్స్ లు కలిసి రావని తెలిసి కూడా బాలయ్య.. రీమిక్స్ జోలికి వెళ్లడం వెనుక ఓ కారణం ఉంది. 

 

బాలకృష్ణ, బోయపాటి సినిమాలో రీమిక్స్ సాంగ్ ఉంటుందంటున్నాయి చిత్రవర్గాలు. తమన్ సంగీత సారథ్యంలో బంగారు బుల్లోడులోని రెయిన్ సాంగ్ న మరింత వెస్ట్రన్ గా రీమిక్స్ చేస్తున్నారట. 

 

బాలయ్యకు రీమిక్స్ సాంగ్స్ కలిసి రాలేదు. ఇప్పటి వరకు మూడు రీమిక్స్ లు చేస్తే.. ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. భలే తమ్ముడు చిత్రంలోని నేడే ఈనాడే.. సాంగ్ ను అల్లరి పిడుగు కోసం మణిశర్మ రీమిక్స్ చేశాడు. అలాగే.. ఆ మధ్య వచ్చిన పూరీ సినిమాలోని కటి చూపు చెబుతోంది పాట కూడా రీమిక్సే.  జీవిత చక్రంలోని ఈ క్లాసిక్ సాంగ్ ను పాడు చేశారన్న విమర్శలు వచ్చాయి. 

 

రీమిక్స్ విషయంలో బాలయ్యకు ఎన్టీఆర్ కలిసి రాలేదు. చేసిన మూడు రీమిక్సులూ ఎన్టీఆర్ వే కావడం విశేషం. ఛాలెంజ్ రాముడిలోని పట్టుకో పట్టుకో పట్టు చీర సాంగ్ ను ఎన్టీఆర్ వీరాభిమాని అయిన వైవియస్ చౌదరి ఒక్క మగాడులో రీమిక్స్ సాంగ్ గా పెట్టాడు. ఇలా రీమిక్స్ సాంగ్ చేసిన సినిమాలు నిరాశపరచడంతో.. బోయపాటి మూవీ కోసం బాలయ్య యూటర్న్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ రీమిక్సులు నమ్ముకోకుండా.. తను నటించిన బంగారుబుల్లోడులోని స్వాతిలో ముత్యమంత ను రీమిక్స్ గా ఎంచుకున్నాడేమో. మొత్తానికి బాలయ్య రీమిక్స్ సాంగ్ లో ఆడిపాడేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా తన సినిమా పాటనే రీమిక్స్ గా ఎంచుకున్నాడు. ఎపుడూ తండ్రి పాటను ఫాలో అయ్యే బాలయ్య ఈ సారి తన పాటనే సెలక్ట్ చేసుకోవడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: