టాలీవుడ్ లోకి ఛలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రష్మిక మందన.  ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ టైమింగ్ చాలా బాగుంది.  నటించిన ప్రతి సినిమా వరుస విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతుంది.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మంచి హిట్ అయ్యింది.  ఈ మద్య వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ మరో సూపర్ హిట్ అయ్యింది.  ప్రస్తుతం సుకుమార్, బన్ని కాంబినేషన్ లో వస్తున్న మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇలా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస విజయాలతో లక్కీ హిరోయిన్ గా పేరు తెచ్చుకుంది రష్మిక.  ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది. ఇంత బిజీగా ఉంటున్న ఈ అమ్మడు త్వరలో హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోబోతున్నట్లుగా ప్రకటించింది. ఈనేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ హైదరాబాదీ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ బిర్యానీ అంటే దేశ విదేశాల నుంచి వచ్చిన వారు ఎంతో ఇష్టంగా తింటుంటారు.  ప్రపంచ దేశాల్లో హైదరాబాదీ బిర్యానికి  ఎంతో గొప్ప పేరు ఉంది.  ఇక్కడకు వచ్చిన కొత్తలో బిర్యానీ ఎక్కువగా తినేదాన్ని. ఇప్పటికి కూడా బిర్యానీ అంటే ఇష్టమే.

 

కానీ నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్న కారణంగా బిర్యానీ తినలేక పోతున్నాను.  ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టి ఉంచుతున్నాను.. అందుకే కాస్త ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుననాను అన్నారు.   హైదరాబాద్ లోని కొన్ని రోడ్లు ఎంతో లగ్జరీగా ఉంటాయి. అమెరికాలో ఉన్నామా అన్నట్లుగా ఇక్కడ ఉంటుంది.  నాకు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి చార్మినార్, గోల్కొండ చూడాలని కోరిక ఉండేది.. కానీ ఇప్పటికీ నెరవేరలేదు. త్వరలోనే   చార్మినార్ చూసేందుకు వెళ్లాలని ఉంది. అలాగే గోల్కొండకు కూడా ఒకసారి వెళ్లి వస్తాను అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: