అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సుశాంత్‌. నాగార్జున మేనల్లుడిగా వెండితెరకు పరిచయం అయిన ఈ యంగ్ హీరో కెరీర్‌ స్టార్టింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుసగా ఫ్లాప్‌లు రావటంతో సుశాంత్‌ హీరోగా నిలదొక్కుకోవటం కష్టమే అని భావించారు అంతా.

 

కానీ చిలసౌ సినిమాతో సుశాంత్‌ రేంజ్‌ మారిపోయింది. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సుశాంత్‌ను హిట్‌ మెట్టు ఎక్కించింది. ఈ సినిమా తరువాత సినిమాల ఎంపికల్లో కొత్తగా ఆలోచిస్తున్న సుశాంత్‌, అల వైకుంఠపురములో సినిమాలో స్పెషల్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే డిఫరెంట్‌ టైటిల్‌ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

 

వరుసగా చిలాసౌ, అల వైకుంఠపురములో సినిమాలతో ఆకట్టుకున్న యంగ్‌ హీరో సుశాంత్ తాజాగా మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఈ యంగ్ హీరో ప్రముఖ శీతలపానీయం బ్రాండ్‌ స్ప్రైట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యహరించనున్నాడు. ఆ బ్రాండ్ కు ఆయన చేసిన మొదటి కమర్షియ యాడ్ విడుదలైంది.

 

ఇదివరకటి యాడ్స్ తరహాలోనే ఎగ్జైటింగ్‌గా రూపొందించిన ఈ టెలివిజన్‌ కమర్షియల్ లో సుశాంత్ ఉబర్ కూల్ లుక్స్ లో ఆకట్టుకున్నాడు. 'స్ప్రైట్'కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుండగా తెలుగు వర్షన్‌లో సుశాంత్ నటించాడు.

 

హీరోగా 'చి.ల.సౌ' సినిమాతో సక్సెస్ సాధించిన సుశాంత్, దాని తర్వాత ఒక కీలక పాత్ర పోషించిన 'అల.. వైకుంఠపురములో' చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే రొమాంటిక్ థ్రిల్లర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: