ఈ మద్య టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమా హిట్ తో తెగ పాపులర్ తెచ్చుకుంటున్నారు.  ముఖ్యంగా ఇతర భాషల నుంచి వస్తున్న హీరోయిన్లు లక్కీ కలిసి వచ్చి స్టార్ హీరోయిన్లుగా మారుతున్న విషయం తెలిసిందే. ఇక సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది షాలినీ పాండే.   ఈ మూవీలో కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నా.. ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఈ అమ్మడు చాలా కూల్ గా చేసింది. ఈ మద్య హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం. నటించే సత్తా ఉన్నా సరయిన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతున్నవారు కొంతమంది ఉన్నారు.  

 

నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు కొంత మంది ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు బాగా కలిసి వచ్చింది. సందీప్ వంగ బాలీవుడ్ లోకబీర్ సింగ్ తెరకెక్కించి అక్కడ కూడా తన సత్తా చాటుకున్నాడు. కానీ ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన శాలినిపాండేకు అస్సలు కలిసి రాలేదు. ఈ అమ్మడు తమిళ్ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాలు చేసిన వర్కౌట్ అవ్వలేదు. దాంతో తిరిగి టాలీవుడ్ లో ఇటీవల రాజ్ తరుణ్ సరసన ఒక సినిమాలో నటించింది.

 

ఆ సినిమాకూడా ఫ్లాప్ అయ్యింది.  ప్రస్తుతం బాలీవుడ్ లో ణవీర్ తో   కలిసి 'జయేష్‌ భాయ్‌ జోర్దార్‌' చిత్రంలో నటిస్తోంది.  ఇన్ని భాషల్లో నటిస్తున్న తనకు  పాత్ర స్వభావం ముఖ్యమని చెబుతోంది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ షోలకు మాత్రమే పరిమితం కాకూడదని నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చెయ్యాలని అంటుంది. కేవలం అందం మాత్రమే కాదు.. నటన కూడా హీరోయిన్లకు ఖచ్చితంగా అవసరం అని అంటుంది. ఏదో ఒకరోజు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ నటించాలని ఉంది' అని షాలిని మనసులోని మాటలు చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: