దాదాపు రెండేళ్ళ తర్వాత మేకప్ వేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆఫర్లు రావడం, దర్శక నిర్మాతలు మళ్ళీ ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం, పవన్ కూడా రాజకీయాలను కొన్నాళ్ళు పక్కన పెట్టి తన సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని భావించడంతో ఇప్పుడు దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకి వస్తున్నారు. కథ ఆయన కోసం ప్రత్యేకంగా రాసుకుని సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరు అవునన్నా కాదన్నా పవన్ మేనియా నడుస్తుంది. 

 

బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ వకీల్ సాబ్ ని చేస్తున్న పవన్ కళ్యాణ్సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమవుతుంది. ఇప్పటికే కథను కూడా క్రిష్ దాదాపుగా సిద్దం చేసుకున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే పవన్ గురించి తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. క్రిష్ తో చేస్తున్న సినిమా మార్చ్ లో షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కీలక సన్నివేశాల కోసం ఇప్పటికే హైదరాబాద్ లో సెట్టింగ్ కూడా వేసారు. 

 

తాజాగా వచ్చిన వార్త ఆధారంగా చూస్తే.... పీరియాడిక‌ల్ క‌థాంశంతో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నార‌ని సిని వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మాత్రం స్పష్టంగా తెలియకపోయినా ఈ ఏడాది చివర్లో కూడా వచ్చే అవకాశం ఉందని మాత్రం అంటున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ని విరూపాక్షి అనుకుంటున్నారు. కోహినూర్ వజ్రం ఆధారంగా సినిమా కథ ముందుకి సాగుతుంది అని టాక్. గత కొంత కాలంగా హిట్స్ లేని పవన్, క్రిష్ కి ఈ సినిమా ఏ ఫలితం ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: