వెంకటేష్, సౌందర్య... ఒకప్పుడు టాలీవుడ్ లో హిట్ పెయిర్. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళు. థియేటర్ కి వెళ్ళడానికి ముందు రోజు నుంచే రెడీ గా ఉండే వాళ్ళు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పనులు పక్కన పెట్టి మరీ వీళ్ళ సినిమా చూసే వాళ్ళు. ఆ విధంగా టాలీవుడ్ లో ఈ జోడి చెరగని ముద్ర వేసింది. చేసింది 5 సినిమాలే అయినా వీళ్ళ జోడి సూపర్ హిట్ జోడీ గా పేరు తెచ్చుకుంది. ప్రతీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. 

 

రాజా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ జోడి. దీనితో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలో వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. వీళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. వీళ్ళ వివాహం గురించి పెద్ద చర్చలు జరిగాయి. చాలా మంది వీళ్ళు భార్యా భర్తలు కూడా అనుకున్నారు అప్పట్లో. అప్పటికే వెంకటేష్ కి పెళ్లి అయిపోయినా సరే భార్యకు విడాకులు ఇచ్చి చేసుకుంటాడు అనుకున్నారు. 

 

కొంత మంది వీళ్ళు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అని, ఆ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత వీళ్ళు విడిపోయారని కూడా ప్రచారం జరిగింది. ఏది ఎలా ఉన్నా సరే అప్పట్లో ఈ పెయిర్ కి మంచి గుర్తింపు వచ్చింది అనేది నిజం. ఈ జోడి టాలీవుడ్ హిట్ పెయిర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇంకా నయం అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది గాని లేకపోతే మాత్రం వీళ్ళకు పిల్లలు ఉన్నారని కూడా ప్రచారం చేసే వారు. కాగా ఎన్నికల ప్రచారం సమయంలో సౌందర్య విమాన ప్రమాదంలో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: