టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు పెంచాడు.  భరత్ అనే నేను, మహర్షి తర్వాత ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు తో సూపర్ హిట్స్ అందుకున్నాడు. వరుస హ్యాట్రిక్ సాధించిన మహేష్ బాబు  తన తర్వాత చిత్రం వంశి పైడిపల్లితోనే ఉంటుందని ఆ మద్య ప్రకటించారు.  అయితే ఈ దర్శకుడు తీసుకు వెళ్లిన స్క్రిప్ట్ విషయంలో ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట.. దాంతో బలమైన కథ ఒకటి తయారు చేసుకోవాలని సూచించారట.  దాంతో ఇప్పుడు వంశిపైడిపల్లి ఆపనిలో ఉన్నారు. ఈ గ్యాప్ లో మహేష్ బాబు మరో స్టార్ డైరెక్టర్ తో ఏదైనా చిత్రం ఉండబోతుందని భావించారు. 

 

అయితే ఆ మద్య గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ అందించిన పరుశరామ్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ఆ చిత్రం డేట్ కూడా వచ్చేసింది. మహేష్ బాబు-పరశురామ్  చిత్రం జూలై లో ప్రారంభించనున్నారు. అయితే ఈ చిత్రానికి  గోపిసుందర్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ను నిర్మించబోతోంది. 2021 సమ్మర్ లో  చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటుంది చిత్ర బృందం.  ఇదిలా ఉంటే... పరశురామ్ నాగ చైతన్యతో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పరశురామ్ చైతుతో చిత్రం స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు.

 

ఇలాంటి టైమ్‌లో మహేష్ పిలిచి చిత్రం స్తానంటే పరశురామ్ చైతన్య చిత్రానికి  ప్రస్తుతానికి వదిలేస్తాడా అనేది మరో ప్రశ్న తలెత్తింది. కానీ గతంలో గీతాగోవిందం లాంటి సూపర్ హిట్ అందించిన పరుశరామ్ పై గత కొంత కాలంగా అందరు హీరోలకు మంచి పాజిటీవ్ ఉంది. అందుకే సూపర్ స్టార్ ఈ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.  ఈ జూలై లోపు సూపర్ స్టార్ కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న చిరంజీవి 152 చిత్రంలో  ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు అని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: