టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి తరువాత సినిమాలకు విరామం పలికి ఆపై రాజకీయాల్లో బిజీ అయిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం కొద్దిరోజుల క్రితం మళ్ళి ముఖానికి మేకప్ వేసుకుని ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తున్నారు పవన్. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోర్ట్ డ్రామా మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక ప్రముఖ లాయర్ పాత్రలో పవన్ నటిస్తున్నారు. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బోనీ కపూర్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్న పవన్, అందులో రాబిన్ హుడ్ తరహా గజ దొంగ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే పాన్ ఇండియా ఫీల్ తో ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఆ సినిమాలో బాలీవుడ్ కు చెందిన అర్జున్ రామ్ పాల్ తో పాటు ప్రముఖ హీరోయిన్ జాక్వలీన్ ఫెర్నాండేజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇక సినిమాలోని వారిద్దరి పాత్రల గురించి అతి త్వరలో అనౌన్సుమెంట్ కూడా రానుందని, కొద్దిరోజుల క్రితం దర్శకుడు క్రిష్ ముంబై వెళ్లి, వారిద్దరితో సినిమా కథ కథనాలు వివరించి వచ్చినట్లు టాక్. 

 

అయితే కథ వారికి ఎంతో నచ్చడంతో పాటు పవర్ స్టార్ అందులో హీరో కావడంతో ఏ మాత్రం సంకోచించకుండా వారిద్దరూ కూడా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. దాదాపుగా రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కొన్ని భారీ సెట్టింగులు రూపకల్పన జరుగుతోందని, మార్చి మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు చెప్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: