సినిమా పరిశ్రమకు వచ్చిన తరువాత, ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్ గా అవకాశాలు సంపాదించాలంటే ఒకప్పటితో పోలిస్తే అవి అంత ఈజీగా దక్కవని అంటున్నారు సినీ విశ్లేషకులు. ముందుగా అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదని, ఆ అందాలను ఆరబోసే రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయడానికి నేటి హీరోయిన్లు సిద్ధం అయితేనే కొంత మంది దర్శకులు వారిని తీసుకుంటున్నారని వారు అంటున్నారు. అయితే రాను రాను ప్రేక్షకుల అభిరుచితో పాటు సినిమాలు చూసే వారి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయని, అందువలన దర్శకులకు కూడా హీరోయిన్స్ కొంత రొమాంటిక్ గా నటిస్తేనే కానీ తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. 

 

ఇక ఆ విధంగా ఇటీవల కొన్నాళ్లుగా తన అందచందాలను రకరకాల ఫోజుల్లో ప్రేక్షకులకు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అందిస్తూ, వారి కంటికి వీనుల విందు చేస్తున్న ముద్దు గుమ్మ రాయ్ లక్ష్మి. శ్రీకాంత్ సరసన నటించిన కాంచన మాల కేబుల్ టివి సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మి రాయ్, ఆ సినిమాతో కేవలం పర్వాలేదనిపించుకునే విజయాన్ని అందుకున్నప్పటికీ, తన అందం, అభినయం తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి ముద్ర అయితే వేసిందని చెప్పాలి. 

 

ఇక ఆ తరువాత నుండి మెల్లగా అవకాశాలు అందుకున్న లక్ష్మి రాయ్ కి ఎక్కువగా తెలుగు కంటే కన్నడ, తమిళ సినిమాల్లోనే అవకాశాలు దక్కాయని చెప్పాలి. నిజానికి ఇటు తెలుగులో కూడా అక్కడక్కడా కొన్ని సినిమాల్లో ఆమె నటించినప్పటికీ హీరోయిన్ గా ఆమెకు ఇక్కడ సరైన గుర్తింపు రాలేదని అంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతలో అనన్య సామాన్యం అని అందరితో అనిపించుకునే లక్ష్మి రాయ్ కి, పాపం తెలుగులో అవకాశాలు రాకపోవడం మాత్రం కొంత బాధాకరమే అని కొందరు నెటిజన్లు అభిప్రాయాడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: