సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అల వైకుంఠపురములో. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో అన్ని కోణాలు ఉండటంతో వసూళ్లు కూడా భారీగానే సాధించింది ఈ సినిమా. దాదాపు 180 కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లు ఉన్నాయి. నాన్ బాహుబలి రికార్డ్ లు చాలానే సాధించింది అల్లు అర్జున్ సినిమా. 

 

దీనితో ఇప్పుడు టాలీవుడ్ హీరోలు చాలా మంది బన్నీ ని టార్గెట్ చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటి వరకు 159 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసింది. పవన్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈయన టార్గెట్ 150 కోట్లుగా పెట్టాడు. దీనితో రీమేక్ సినిమాకు అంత సీన్ ఉంటుందా అనే ప్రశ్న వినపడుతుంది. ఇక ట్రిపుల్ ఆర్ ఎలాగూ సాధిస్తుంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఇక మిగిలిన మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలే ఏ విధంగా ఆకట్టుకుంటాయి అనేది చూడాల్సి ఉంది. 

 

క్రిష్ సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తుంది. కచ్చితంగా ఈ సినిమాకు వందల కోట్లు వసూలు చేసే సత్తా ఉంది. ఇక ప్రభాస్ సాహో సినిమాతోనే 200 కోట్లకు పైగా వసూలు చేసాడు. రాధాకృష్ణ కుమార్ సినిమాతో బన్నీ రికార్డులను దాటేయాలని ప్రభాస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు కూడా ఇప్పుడు బన్నీ ని టార్గెట్ చేసే పరిస్థితి వచ్చింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో 120 కోట్ల షేర్ దాటాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉంది. ఆ సినిమా మరి ఏ స్థాయిలో వసూలు చేస్తుంది అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: