టాలీవుడ్, బాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యులు ఎంతో మంది దర్శకులుగా మారి మంచి హిట్స్ అందించారు.  అలాంటి వారిలో కృష్ణ వంశి, పూరి జగన్నాథ్ ల తర్వాత ఆర్ ఎక్స్ 100 మూవీతో మంచి విజయం అందుకున్నాడు అజయ్ భూపతి.  మొదటి మూవీ కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్ అంతా కొత్తదనంతో ‘ఆర్ ఎక్స్ 100’ రూపొందింది.  మొదట ఈ మూవీ పోస్టర్స్, టీజర్ చూసి చాలా మంది బోల్డ్ కంటెంట్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.  అయితే ఈ మూవీ ఓ గ్రామీణ వాతావరణంలో కొనసాగుతుంది.. ప్రియురాలి చేతిలో మోసపోయిన ఓ భగ్నప్రేమికుడి కథ..  మొత్తానికి థియేటర్లో ఈ మూవీపై పాజిటీవ్ టాక్ రావడంతో సూపర్ హిట్ అయ్యింది.  పెట్టిన పెట్టుబడికి డబులు కాదు మరింత ఎక్కువే వచ్చింది.

 

 ఇందులో నటించిన హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ కి మంచి పేరు వచ్చింది.  ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి ‘సముద్రం’ అనే మూవీ తో రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఆర్ ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్ పూత్ కొన్ని సినిమాల్లో నటించింది.  ఆర్‌డీఎక్స్‌ లవ్‌', 'వెంకీమామ', 'డిస్కోరాజా' మూవీలతో పాయల్‌ తెలుగులో మంచి గుర్తింపుని తెచ్చుకుంది.  గత సినిమాల భిన్నమైన పాత్రని ఇందులో పోషిస్తుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా ఆమె ఇందులో కనువిందు చేయనున్నారు.

 

గుణశేఖర్‌ దగ్గర పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్‌ దర్శకత్వంలో క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ మిస్టరీ డ్రామాగా ఈ మూవీ రూపొందుతుంది. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ మార్చి 4న విడుదల చేయనున్నారు అని చెప్పింది.  ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో కనిపించినా.. ఈసారి ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు.. ఈ పాత్ర అందరికీ నచ్చుతుందని పాయల్ రాజ్ పూత్ నమ్మకాన్ని వ్యక్తం చేసింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: