టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అందరికీ పిచ్చ క్రేజ్ ఉన్న మాట వాస్తవమే. విజయ్ దేవరకొండ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా పెళ్ళి చూపులు సింపుల్ అండ్ డీసెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించి డీసెంట్ హిట్ ని అందుకున్నారు మొత్తం యూనిట్. అందులో బాగా పేరొచ్చింది హీరోగా విజయ్ దేవరకొండకి ఆ తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ కి. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా చాలా చిన్న సినిమాలు నిర్మించే నిర్మాతలకి ఇన్ స్పిరేషన్ గా నిలిచింది. ఈ చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి బాగా సంపాదించుకున్నారు. ఈ సినిమాతోనే రాజ్ కందుకూరి అభిరుచి గల నిర్మాతగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు.

 

ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని ఇచ్చింది. అయితే అదే విజయ్ కి అన్నీ రకాలుగా బాగా మైనస్ అయింది. క్రేజ్ ఎంతగా వచ్చిందో అంతకంటే ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు విజయ్ ని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఒక్క గీత గోవిందం తప్ప విజయ్ చేసిన మిగతా సినిమాలన్ని అదే ఫ్లేవర్ తో వస్తున్నాయని విజయ్ కి ఆ సినిమా యాటిట్యూడ్ పాయిజన్ లా ఒళ్ళంతా పాకిందని ఫ్యాన్సే చిరాకు పడుతున్నారు.

 

అయితే ఆ ఒక్క సినిమాతో ఎంతగా సక్సస్ అయ్యాడో అంతగా ఫ్లాప్స్ కూడా కృంగదీస్తున్నాయి. ఇదే ఒక తలనొప్పి అయితే ఆయన నిర్మాతగాను మారి తనకి హీరోగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. హీరోగా పూర్తిగా సెటిలవకముందే సొంత బ్యానర్ పెట్టి సినిమాలని నిర్మించాలన్న ఉద్దేశ్యం ఎందుకొచ్చిందో అని అందరూ అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం హీరోగా విజయ్ పరిస్థితి చెప్పాలంటే దారుణంగానే ఉంది.

 

అయినా లగ్జరీ లైఫ్ కి మాత్రం ఏమాత్రం ఢోకా లేకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు నిర్మాతగా మళ్ళీ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇది తెలిసిన విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే హీరోగా నిర్మాతగా చేతులు కాల్చుకున్నావు. మళ్ళీ నిర్మాతగా సినిమా అంటే ఈ సారి ఒళ్ళంతా అంటించుకుంటావా ..ముందు సరిగ్గా హిట్స్ కొట్టు అంటూ సలహాలిస్తున్నారట విజయ్ సన్నిహితులు. మరి మన రౌడీ హీరో వింటాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: