మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ తర్వాత తన చిలిపి నవ్వుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నాగచైతన్యతో ఎన్నో ఏళ్ళు ప్రేమాయణం కొనసాగించి... పెళ్ళితో అక్కినేని కోడలిగా మారిపోయింది. ఇక అక్కినేని కోడలిగా మారిపోయిన తర్వాత ఈ అమ్మడికి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇక ఈ అమ్మడు నటించిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుండడం తో ఓవైపు అక్కినేని కోడలిగా మరోవైపు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఈ అమ్మడి పేరు మార్మోగిపోయింది. ఇక గత సంవత్సరం అయితే ఈ అమ్మడు పట్టుకున్నదల్లా  బంగారం అయ్యింది అని చెప్పాలి. సమంత నటించిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. 

 

 

 ఇకపోతే సమంత కు మొదటి నుంచి థ్రిల్లర్ జోనర్ సినిమాలు అంతగా  కలిసి రావడం లేదు అన్న విషయం తెలిసిందే. రాజు గారి గది 2 లో సమంత నాగార్జున లాంటి  క్రేజ్ ఉన్న నటులు నటించినప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకాదరణ పొంద లేకపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన యూ టర్న్ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాకు హారర్ సినిమాకు  కమిట్ అయ్యా అందరికీ షాక్ ఇచ్చిన సమంత. ఈ సంవత్సరంలో మరో రెండు సినిమాలు చేయబోతుంది సమంత. విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ముక్కోణపు ప్రేమకథ అనే చిత్రంతో పాటు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అదేంటో  తెలియదు కానీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మాత్రం నటించడం లేదు ఈ అమ్మడు. ప్రస్తుతం సమంత దృష్టి మొత్తం తమిళ సినిమాల పైనే. 

 

 

 అయితే ఇప్పటికే మాయ గేమ్ ఓవర్ లాంటి పలు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ తో ఓ సినిమా చేస్తోంది. అయితే అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇకపోతే సమంత కు ఇప్పటికే థ్రిల్లర్ జోనర్ లో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ మరోసారి సమంత మూవీ ఎంచుకోవడానికి కారణం ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే దర్శకుడు అశ్విన్ శరవణన్ ఇప్పటికే విభిన్నమైన రీతిలో హారర్ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ  నేపథ్యంలోనే సమంతకు  కూడా ఓ విభిన్నమైన కథ చెప్పడంతో ఈ సినిమాకు సమంత సైన్ చేసింది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: