సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత వివాదాలు కామన్ అన్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల మధ్య అప్పుడప్పుడు కొన్ని వివాదాలు చెలరేగుతుంటాయి. అయితే కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు అటు బుల్లితెరపై కూడా పలు వివాదాలు జరుగుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న జబర్దస్త్ వివాదం బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇదే అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జడ్జిగా కొనసాగిన నాగబాబు ఆ తర్వాత జబర్దస్త్ షో నుంచి పక్కకు తప్పుకొని జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షో ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం నాగబాబు తన యూట్యూబ్ ఛానల్  ద్వారా జబర్దస్త్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో కొన్ని వారాలపాటు ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. 

 

 

 అదిరింది షో జబర్దస్త్ అంతగా లేకపోవడంతో నాగబాబు జబర్దస్త్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే జబర్దస్త్ లోకి నాగబాబు వచ్చేందుకు నిర్ణయించినప్పటికీ మల్లెమాల యాజమాన్యం మాత్రం గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు దృశ్య నాగబాబును  మరోసారి జడ్జిగా తీసుకునేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి బుల్లి తెర పై ఎన్నో  వార్తలు ప్రచురితం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వివాదమే బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే జబర్దస్త్ నుంచి తప్పుకొని జీ తెలుగులో అదిరింది అనే కార్యక్రమాన్ని నాగబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే ఈ షో లో ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా... అదిరింది మొదలైనప్పటి నుంచి తన యాంకరింగ్ తో అదరగొడుతున్న సమీరా ప్రస్తుతం అదిరింది షో యాంకర్ గా తప్పుకుంది. అదిరింది షో కి కొత్త యాంకర్ గా యాంకర్ రవి భాను  వచ్చారు. అయితే అదిరింది సూపర్ హిట్ కాకపోవడం వల్లనే ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి అని మరో చర్చ మొదలైంది. ఎలాగైనా జబర్దస్త్ కు  అదిరింది షో ను పోటీగా తీసుకురావాలని భావిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు... అదిరింది షో  బాగా పాపులర్ కావడానికి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటూ మార్పులు కూడా చేస్తున్నట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: