టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో లవ్ స్టోరీ జాన్ చేస్తోన్న సంగతి అందరికి విదితమే. ఈ సినిమా తర్వాత ప్రభాస్, జాతీయ ఉత్తమ సినిమా మహానటి తీసిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రకటన సందర్బంగా, ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ ఇటీవల స్పందించారు.

 

IHG

 

అయన మాట్లాడుతూ, ఇది కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదని, పాన్ వరల్డ్ సినిమా అవ్వబోతుందని చెప్పుకొచ్చాడు. ఇది విన్న అభిమానులు అపుడే ఊహల్లో విహరిస్తున్నారు. ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని సెలెక్ట్ చేస్తున్నట్లు వినికిడి. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ హిందీ నటి దీపికా పదుకొనేను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు గుస గుస. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు, బుకింగ్ జరిగిపోయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. 

 

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ గత చిత్రం ‘మహానటి’ మాదిరే ఈ సినిమాని కూడా అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు వినికిడి. ముఖ్యంగా డార్లింగ్ అభిమానులు అదిరిపోయేలా ఈ సినిమా ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. 

 

IHG

 

ఈ ఏడాది చివర్లో సినిమా మొదలు పెట్టి, వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని సదరు టీమ్  ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ అప్పట్లో మహానటి విడుదల సమయంలోనే పాతాళ భైరవి తరహాలో ఓ సినిమా అనుకుంటున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. చందమామ కథలాంటి కథతో ఈ సినిమా సిద్ధం అయిందట. చూద్దాం మరి, చందమామ లాంటి పాతాళ భైరవి అవుతుందో.. లేక అనగనగా ఒక ధీరుడు అవుతుందో వేచి చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: