డైరెక్టర్ వంశీ పైడిపల్లి కి ఓ మాదిరి అవమానం జరిగిందని మొన్నటివరకు వచ్చిన వార్తలో నిజముందని సినీ ప్రముఖులు చెవులు కొరుక్కుంటున్నారు. వంశీ పైడిపల్లి ఒక స్క్రిప్ట్ రాసుకుని దాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు కు వినిపించగా... అతడు మాత్రం ఆ కథ నచ్చలేదని మొహం మీదనే చెప్పేసాడు. దీంతో వారిద్దరి మధ్య ఉన్న సన్నిహిత బంధం కాస్త చెండిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. నిర్మాత దిల్ రాజు వంశీ పైడిపల్లి కి నచ్చచెబుతూ వేరే స్క్రిప్ట్ తో రాండి. అప్పుడు మహేష్ మీ దర్శకత్వంలో సినిమా తీస్తారు అని చెప్పుకొచ్చాడట.



ఒకవేళ మహేష్ బాబు స్క్రిప్ట్ ని విని ఓకే చెప్పేసినట్లయితే... మహర్షి సినిమా తరువాత ఇది మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రొండవ చిత్రం అయ్యేది. కానీ మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు కాబట్టి వంశీ పైడిపల్లి ఒక వారం రోజుల వరకు ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మళ్ళీ ఇప్పుడు స్క్రిప్ట్ చేత పట్టి రామ్ చరణ్ తేజ్ లేదా జూనియర్ ఎన్టీఆర్ కు కలిసేందుకు వంశీ సిద్ధమవుతున్నాడు. కానీ ఒక్కసారి రిజెక్ట్ అయిన తన స్క్రిప్ట్ ని ఈ బడా హీరోల వద్దకు తీసుకెళితే వాళ్లు కూడా రిజెక్టు చేస్తారేమోనని వంశీ పైడిపల్లి కి భయం పట్టుకుందట.



ఏదేమైనా, ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో సినిమా తీయాలంటే అది దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ షూటింగ్ ఏప్రిల్ నెలలో పూర్తవుతుంది. పూర్తయిన వెంటనే జూ.ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయనున్న సినిమా షూటింగ్ లో బిజీ అయిపోతారు. ఆ షూటింగ్ మొత్తం పూర్తయ్యే లోపు మరో అయిదారు నెలలు పట్టవచ్చు. ఒకవేళ ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి తో సినిమా చేసేందుకు అంగీకరించినా... తన డేట్స్ దొరకాలంటే చాలా టైం పడుతుంది.



ఇక మిగిలింది చెర్రీ. చెర్రీ కూడా మహేష్ బాబు లాగానే తన చేయబోయే సినిమా స్క్రిప్ట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇప్పటివరకైతే అతనిని చాలామంది డైరెక్టర్లు కలిసారు కానీ ఇంత వరకు ఎవరితో సినిమా చేసేందుకు రాంచరణ్ కమిట్ అవ్వలేదు. మరి అతను వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ ని మెచ్చుతాడో లేదో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: