టాలీవుడ్ లో మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు తాను ఎంచుకునే మూవీస్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలు వహిస్తుంటారు. దానికి కారణం కెరీర్ బిగినింగ్ లో ఆయన కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు.. అప్పటి నుంచి మహేష్ ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఈ విషయంలో ఆయన సతీమణి నమ్రత కూడా ఎంతో సహాయసహకారలు ఉంటుంటాయి. 

 

మహేష్ మూవీ రిలీజ్ ముందు కూడా ఈ మద్య ప్రమోషన్ వర్క్ లు బాగానే చేస్తున్నారు.  ఒకప్పుడు మీడియా ముందుకు రాని మహేష్ బాబు ఇప్పుడు వరుసగా ఛానల్స్ ముందుకు వచ్చి చిట్ చాట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  ఇక భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూవీస్ తో హ్యాట్రిక్ విజయం అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు మరో మూవీకి సిద్దమవుతున్నారు.  వాస్తవానికి మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన వంశిపైడిపల్లితో ఓ మూవీ ఉంటుందని భావించారు. కానీ ఆయన స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇది కొంత కాలం పోస్ట్ పోన్ పడిందని వార్తలు వచ్చాయి. గీతాగోవిందం లాంటి సూపర్ హిట్ అందించిన పరుశరామ్ తో తన తదుపరి సినిమా ఉండబోతుందని ఈ మద్య వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు కి బాలీవుడ్ లో ఓ బిగ్గెస్ట్ ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

 

ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా చర్చలు జరిపినట్టు ఫిల్మ్ నగర్ టాక్. రణవీర్ సింగ్మహేశ్ బాబుతో భారీ మల్టీ స్టారర్ సినిమాను,  ప్యాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని  సాజిద్ ప్లాన్ చేస్తున్నాడట. ఎప్పటి నుంచి పాన్ ఇండియా మూవీ నటించాలని మహేష్ భావిస్తున్నారు.. ఇదే గనక నిజమే అయితే ఆయన కోరిక తీరినట్టే. కాబట్టే ఈ ఇద్దరు స్టార్స్ ను కలిపితే ఇండియన్ బాక్సాఫీస్ దున్నేయొచ్చన్నది ఈ నిర్మాత ఆలోచనట. అయితే ఈ ప్రాజెక్ట్  విషయంలో మహేశ్ నుండి ఇంకా క్లారిటీ రావాల్సి ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: