టాలీవుడ్ లోకి  కెరటం మూవీ తో హీరోయిన్ గా  పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. మోడల్ గా కెరీర్ మొదలు  పెట్టిన ఈ బ్యూటీ తర్వాత తెలుగులో కెరటం మూవీతో హీరెోయిన్ గా పరిచయం అయ్యింది.   ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కి పెద్దగా పేరు రాలేదు కానీ సందీప్ కిషన్ తో నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ కి మంచి పేరు వచ్చింది.  ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ కోలీవుడ్ హీరోల సరసన నటిస్తూ హీరోయిన్ గా మారింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్య బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అక్కడ కూడా వరుసగా సినిమాలు చేస్తుంది.

 

 రకుల్ ప్రీత్ సింగ్ గత ఏడాది నాగార్జున నటించిన మన్మథుడు 2 ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు.  ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ మూవీ విషయాల్లోనే కాదు ఇతర విషయాల్లో యాక్టివ్ గా ఉంటుంది.  ఇక్కడ కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తే పాత హీరోయిన్ లకు బాయ్ బాయ్ చెబుతాడని ఆ విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీతి సంచలన వ్యాఖ్యలు చేసింది.  తన కెరీర్ ఆరంభంలో చాలా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది బాధపడింది.

 

తాను చేయాల్సిన సినిమాలు ఇతర హీరోయిన్లు చేసి ఫ్లాప్ అయ్యాయి అని చెప్పుకొచ్చింది.   ఇక హీరోయిన్ల పారితోషికం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.    హీరోయిన్ల కంటే హీరోల రెమ్యునేషన్  ఎక్కువగా ఉంటుందని హీరోలు హీరోయిన్లు ఒకే స్థాయిలో కష్టపడ్డా ఫలితం వాళ్ళే ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఈ మధ్య ఆడవారికి సమానత్వం ఉండాలని అన్ని విషయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బహుశా అదే విషయాన్ని ఈ అమ్మడు చెప్పకనే చెప్పింది అని అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: