ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకాలపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 

గోవాలో జరిగిన ఒక యదార్ధ ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఈ ఘటనలో నలుగురు అమ్మాయిలు చిక్కుకొని దాని నుంచి ఎలా బయటపడ్డారు అన్న కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. వయసులో ఉన్న అమ్మాయిల ఎంజాయ్‌మెంట్‌ హద్దులు మీరితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాని నలుగురు హీరోయిన్లు కలిసి చేసిన కామెడీ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించారని ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ టీజర్ తో అర్థమవుతోంది.  

 

దేవుడు ముందు అందరూ సమానమే. సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా ఆ భగవంతుడు ఒక్కడే. అయితే, సామాన్యులు దేవుడిని దర్శించుకుంటే అది ఎవరూ అంతగా పట్టించుకోరు. కానీ సినిమా సెలబ్రిటీలు గనక దేవుడి దర్శనం కోసం వెళ్తే అదే పెద్ద ఆసక్తికరమైన విషయం గా చెప్పుకుంటారు. అందులోనూ ఒకేసారి నలుగురు హీరోయిన్లు కలిసి దైవ దర్శనం చేసుకుంటే అక్కడున్నవాళ్లంతా ఇదే విషయాన్ని ఆసక్తికరంగా చర్చించుకుంటారు. ఇలాంటి ఆసక్తికరమైన ఘటన తాజాగా తిరుమలలో చోటుచేసుకుంది. నలుగురు హీరోయిన్లు ఒకేసారి కాలినడకన తిరుమల వెళ్ళి తమ సినిమా మంచి విజయం సాధించాలని ఆ ఏడుకొండలవాడిని వేడుకున్నారు.  

 

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ తిరుమలకు వెళ్లి వెంకన్న స్వామినీ దర్శించుకున్నారు. ఈ ఆదివారం నలుగురు హీరోయిన్లతో పాటు చిత్ర యూనిట్ మొత్తం కాలినడకన తిరుమలకు శ్రీవారిమెట్టు నుంచి కాలినడక మొదలుపెట్టి వీరంతా తిరుమల వెళ్లారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదంతా తమకి సక్సస్ రావాలన్న తాపత్రయంతో చేస్తున్నారు. ఏదేమైనా అంతా మంచే జరిగి వీళ్ళు చేసిన ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: