టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని, పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కథ పరంగా ఒక ధనికుడి కొడుకు పేద వాడిగా, అలానే పేద వాడి కొడుకు ధనికుడిగా కొన్ని కారణాల వలన పెరగవలసి వస్తుంది. అయితే ఆ తరువాత కథ, ఏ విధంగా ముందుకు సాగింది. 

 

ఇక చివరికి ఆ కొడుకులు ఇద్దరూ అసలు తండ్రుల వద్దకు చేరారా లేదా అనే కథాంశంతో త్రివిక్రమ్ ఈ సినిమాని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఎస్ ఎస్ థమన్ అందించిన ఈ సినిమాలోని ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాముల సాంగ్స్ అయితే 200 మిలియన్లకు పైగా వ్యూస్ తో అలానే 1 మిలియన్ కి పైగా లైక్స్ తో యూట్యూబ్ లో సరికొత్త రికార్డు ని నెలకొల్పడం జరిగింది. ఇక ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ నేటితో సక్సెస్ఫుల్ గా 50 రోజలు పండుగ జరుపుకుంది. 

 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బన్నీ ఫ్యాన్స్, ఈ సినిమా అర్ధ శతదినోత్సవ వేడుకలకు పలు థియేటర్స్ వద్ద బాణా సంచా కాలుస్తూ, అన్నదానాలు నిర్వహిస్తూ ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఇక తమ సినిమా 50 రోజలు పూర్తి చేసుకోవడంతో కాసేపటి క్రితం బన్నీ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టారు. తమకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు అలానే, ఇంత గొప్ప సినిమాని తీయడానికి సహకరించిన యూనిట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ బన్నీ పోస్ట్ చేయడం జరిగింది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: