సౌత్, నార్త్ సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బాహాటంగా తమ అనుభవాలను వెల్లడిస్తూ గోడు వెల్లబోసుకుంటున్న సంగతి తెలిసందే. ఇప్పుడు ఈ హీరోయిన్ లో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా ఉన్నానై అందరికి పెద్ద షాకిచారు. ‘మీటూ’ ఉద్యమానికి సపోర్ట్ చేసిన కొంత మంది హీరోయిన్స్ లో వరలక్ష్మీ కూడా ఉన్న సంగతి తెలిసందే. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న లైంగిక వేధింపుల గురించి తాజాగా మళ్ళీ వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని చాలా మంది నిర్మాతల నుంచి తాను ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.

 

తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిసి, హీరోగా, రాజకీయ నాయకుడిగా తన తండ్రి శరత్‌కుమార్ గురించి తెలిసి కూడా తనను సెక్సువల్ ఫేవర్ అడిగారని వరలక్ష్మి వెల్లడించారు. అయితే ఇలాంటి సెక్సువల్ ఫేవర్స్‌ను నేను తిరస్కరించానని, అందుకే ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలవడానికి కాస్త లేట్ అయిందని తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ఇలాంటి వాటికి కచ్చితంగా ‘నో’ చెప్పాలని, ధైర్యంగా జరుగుతున్న విషయాలని బయట ప్రపంచానికి తెలపాలని సూచించారు. 


 
ఇండస్ట్రీలో అవకాశాల కోసం, కెరీర్‌లో ఎదగడం కోసం కమిట్‌మెంట్ నే ఎరవేసి అవకాశాలు దక్కించుకునే వాళ్ళ గురించి మనం కామెంట్ చేయనవసరం లేదు. అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. అలాంటి నాలా సరైన అవకాశం వచ్చేంత వరకు వేచి చూడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీ ప్రతిభను నిరూపించుకోండి .. అంతేగాని కమిటయిఏనే అవకాశాలు ఇస్తారని మోసపోవడం మూర్ఖత్వం అని వరలక్ష్మి వెల్లడించారు.

 

ఇక హీరోయిన్‌గా వరలక్ష్మీ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకోలేకపోయింది. కాఇ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మాత్రం బిజీ గా ఉన్నారు. దళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘సర్కార్’ సినిమాలో లేడీ విలన్‌గా వరలక్ష్మి నటన ఆకట్టుకుంది. ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాతో వరలక్ష్మి టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం వరలక్ష్మి రవితేజ హీరోగా తెరకెక్కుతోన్ ‘క్రాక్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: