సమంత నాగ చైతన్య జీవితం మొదలైందంటే అది 2010 లో విడుదలైన ఏమాయ చేశావే సినిమాతోనే అని చెప్పాలి. ఈ సినిమా వీళ్ళిద్దరి జీవిత భాగ స్వాములని చేస్తుందని సినిమా తీసిన డైరెక్టర్ కూడా ఊహించి ఉండరు. ఇక ఇదిలా ఉంచితే ఈ సినిమా రిలీజైయ్యాక సృష్ఠించిన సంచలనాల గురించి అందరికీ తెలిసిందే. సమంత నటించిన ఫస్ట్ మూవీ ఏమాయ చేశావే. నాగచైతన్య కెరీర్ కి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఆ ఇద్దరి మధ్యా రొమాన్స్ ని పీక్స్ లో ఎలివేట్ చేసిన సినిమా కూడా ఏమాయ చేశావే కావడం ఆసక్తికరమైన విషయం. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు ఈ రేంజ్ లో మాత్రం అట్రాక్ట్ చేయలేకపోయాయి. ఇక ఈ సినిమా నుండి ఈ కపుల్ జర్నీ గురించి తెలిసిందే. ఆ ఇద్దరి ప్రేమకు బీజం పడింది ఏమాయ చేవావే సినిమా సెట్ లోనే. అయితే ఇది చాలా కాలం చాలా గోప్యంగా ఉంచారు.

 

ఇక తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రస్తుతం 'ఏ మాయ చేసావే' సినిమాకి సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు. తమిళ వెర్షన్ విన్నయ్ తండి వరువాయికి సీక్వెల్ కథను రాసారట. తొలి భాగంలో  శింబు- త్రిష జంటగా నటించారు. ఇప్పుడు సీక్వెల్లో శింబు నటిస్తారు. కాని హీరోయిన్ మాత్రం ఇంకా ఎవరన్నది ఫైనల్ కాలేదట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. విన్నైతండి వరువాయ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాని వెల్లడించారు. శింబు కాల్షీట్లు ఇస్తే సెట్స్ కెళ్లడమే ఆలస్యం అని కన్ ఫామ్ చేశాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో త్రిష నటించడం లేదట. 

 

త్రిష స్థానంలో స్టార్ హీరోయిన్ అనుష్క ను గౌతమ్ ఎంపిక చేసుకున్నారట. ఈ క్రేజీ సీక్వెల్ లో త్రిష ని గౌతమ్ మీనన్ ఎందుకు తీసుకోలేదో అన్న విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే తెలుగులో 'ఏమాయ చేశావే' సీక్వెల్ తీస్తారా లేదా ..! అన్నదానికి గౌతమ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఒకవేళ తమిళంలో అనుష్క నటిస్తే తెలుగులోనూ తనే నటిస్తుందని కొందరు చెప్పుకుంటున్నారు. అది విన్న కొంతమంది 'ఏమాయ చేశావే' సీక్వెల్ లో అనుష్క అయితే హీరో నాగార్జున నటిస్తాడా .. అంటూ సమంత ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారట. దీన్ని బట్టి మ్యాటర్ ఏంటో అర్థమై ఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: