డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్న హీరో అడివి శేష్‌. ఈ క్రేజీ స్టార్ ఇప్పుడు 'మేజర్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్. ఎస్. జి) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు. ముంబైలోని తాజ్ మహల్ హోటల్లో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో ఎంతో మంది ప్రాణాల్ని కాపాడి, ఆ ప్రయత్నంలో తన ప్రాణాల్ని త్యాగం చేసిన సైనికుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' చిత్రం రూపొందుతోంది.

 

తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా మహేష్ బాబు నిర్మాణ సంస్థ ఘట్టమనేని మహేష్ బాబు (జి. ఎం. బి) ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు నిరాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా టీం తో తాజాగా శోభిత ధూలిపాళ జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.

 

హీరో అడివి శేష్ కూడా తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా.. `మా మునుపటి ఫిల్మ్ 'గూఢచారి' తర్వాత 'మేజర్' సినిమా కోసం శోభితతో మరోసారి కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీలో ఆమె పాత్రకు సొంత కథ ఉంటుంది. భావోద్వేగపరంగా మంచి డెప్త్ ఉన్న డైనమైట్ లాంటి రోల్ ఆమె చేస్తోంది. 'మేజర్' అనేది ఇండియాలోని అందరి కోసం చెబ్తున్న కథ` అంటూ శోభిత పాత్ర గురించి ట్వీట్ చేశాడు శేష్‌. ప్రస్తుతం, 'మేజర్' సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతోంది. అక్కడ ముఖ్య తారాగణంపై ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: