నేటి సమాజంలో సామాన్య మహిళలకే కాదు సినీ సెలబ్రిటీలకు కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. అన్నీ తెలిసిన మహిళలను కూడా చకాచక్యంగా వలలో వేసుకొని వారిని కిడ్నాప్ చేసి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు మగ మృగాళ్లు. అందుకే ఒక వ్యక్తి ఫోన్ చేసి ఎంత మంచిగా మాట్లాడినా వారిని అస్సలు నమ్మకూడదని పెద్దలతో పాటు పోలీసులు కూడా ఎన్నో సందర్భాలలో చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా కొందరు మహిళలు ఏం కాదులే అనుకొని గుడ్డిగా మగవాళ్ళని నమ్మి దారుణంగా మోసపోతున్నారు. ప్రస్తుతం ఒక వార్త సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది.




వివరాలు తెలుసుకుంటే... గత నెల అనగా ఫిబ్రవరి 28వ తారీఖున రాహు అనే థ్రిల్లర్ సినిమా రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షక అభిమానులను బాగా అలరిస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన క్రితి గార్గ్ కి మొన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది. 'హలో ఎవరు? అంటూ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయగా... 'నేను అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ రెడ్డి ని మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ప్రభాస్ పక్కన హీరోయిన్ గా తీసుకోవలనుకుంటున్నాం. ఒకసారి ముంబై కి వచ్చి కలవండి', అని అవతల వైపు ఒక వ్యక్తి మాట్లాడాడు.

 

 

దీంతో ఇది అస్సలు నిజమా? అబద్దమా? అని తెలుసుకోవడానికి ఈ హీరోయిన్ ముంబై కి బయలుదేరి వెళ్ళింది. ఐతే ఈ రోజు పొద్దున పూట నుండి ఆమె ఫోన్ నెంబర్ కి కాల్ చేస్తే కలవడం లేదు. దీంతో హీరోయిన్ కుటుంబసభ్యులు బాగా భయపడుతున్నారు. ఈ విషయాన్ని రాహు డైరెక్టర్ సుబ్బు కి కుటుంబ సభ్యులు తెలియజేయగా... అతను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో క్రితి మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఒక హీరోయిన్ ఇలా ఒక ఫోన్ కాల్ ని గుడ్డిగా నమ్మి ముంబైకి వెళ్లి పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: