సూపర్ స్టార్ మహేష్ బాబుకు, స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ అడ్డుకట్ట వేయబోతున్నాడా. అల వైకుంఠపురంలో సినిమాతో ప్రిన్స్ ని బాక్సాఫీసు వద్ద పడగొట్టిన బన్ని ఇప్పుడు ఆ గ్రేట్ ఛాన్స్ ను కూడా సొంతం చేసుకోవాలని కసిగా ఉన్నాడా? ఇందుకు తండ్రి అరవింద్ తో రాయభారం నడుతున్నాడా? ఇంతకీ ప్రిన్స్ తో బన్నికి పోటీ ఏంటో చూడండి.

 

ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలతో ప్రిన్స్, బన్ని బాక్సాఫీసు ఫైట్ చూశాం. బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ సరిలేరు నీకెవ్వరు టీం అదరగొట్టిన కలెక్షన్లలో అప్పర్ హ్యండ్ అల వైకుంఠపురంలో సినిమాదే అనేది తెలిసిపోయింది. ఈ సంక్రాంతి వార్ ముగిసిందో లేదో ఇప్పుడు మహేష్ బాబు, అల్లుఅర్జున్ మరోసారి పోటీకి రెడీ అయ్యారు. ఓ ఛాన్స్ కోసం బన్ని, ప్రిన్స్ తో పోటీకి దిగుతున్నట్లు టాక్.

 

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు కీ రోల్ ప్లే చేయబోతున్నట్టు తెగ వైరల్ అవుతోంది. యూనిట్ కూడా ఖండించకపోవడంతో ప్రిన్స్ కన్ఫర్మ్ అంటూ కథలు అల్లేస్తున్నారు. అయితే మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అల్లుఅర్జున్ ఆశగా ఉన్నాడట. ఇందుకు సంబంధించి బన్ని గట్టిగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. 

 

చిరంజీవి, రామ్ చరణ్ లతో బన్ని చర్చిస్తున్నాడని టాక్. అందుకు డాడ్ అల్లు అరవింద్ తో కూడా మంతనాలు జరిపినట్టు ప్రచారమవుతోంది. మెగాస్టార్ తో తెర పంచుకోవడానికి ఇదే సరైనా సినిమా అని బన్ని భావిస్తున్నాడా. ఇలాంటి అద్భుతమైన అవకాశం మళ్లీ రాదని అల్లు అరవింద్, రామ్ చరణ్ లను కన్విన్స్ చేస్తున్నాడని వినికిడి. చిరంజీవి, మహేష్ అంటే ఎంతో అభిమానం. బన్ని అంటే కూడా అంతే ప్రేమ. మరీ చిరు ఛాన్స్ ఎవరికి దక్కుతోందో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: