టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత హీరోగా ‘ఖైదీ నెంబర్ 150’తో రీ ఎంట్రీ ఇచ్చారు.  పదేళ్ల క్రితం ఆయన ఎలా ఉన్నారు.. వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’లో కూడా అలాగే ఉన్నారు.  అదే జోష్ తో ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించాడు.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘సైరా’ ఇతర భాషల్లో నిరాశ పరిచింది.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి - కొరటాల కాంబినేషన్ లో ఓ మూవీ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ షరవేగంగా సాగుతుంది. ఆ మద్య చిరంజీవి కి సంబంధించిన ఓ లుక్ కూడా బయటకు వచ్చింది.  దేవాలయాల్లో జరుగుతున్న మాఫియాను హీరో ఎలా ఎదిరించాడు.. ఎలా పోరాడాడు అన్న కాన్సెప్ట్ తో ఉండబోతున్నట్లు సమాచారం.

 

హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఈ మద్య చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ అన్ని ఈవెంట్స్ కి వెళ్తూ వారిని ఉత్తేజ పరుస్తున్నారు.  ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన 'ఓ పిట్టకథ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలు మాట్లాడారు.  తన కెరీర్ ప్రారంభంలో జరిగిన విశేషాలు సైతం అక్కడ ఉన్నవారితో షేర్ చేసుకున్నారు. కొత్త వారు ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంతో అవసరం అని.. టాలెంట్ ఉంటే ఎవరైనా పైకి వస్తారని అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రంగమ్మత్త గెస్ట్‌గా వచ్చినందుకు సంతోషం. మొన్న టెస్ట్‌ చేయించుకున్నాను.. నా గుండె చాలా స్ట్రాంగ్‌గా ఉందని అన్నారు.

 

కానీ, ఇప్పుడు ఎందుకో చాలా పెయిన్‌ వచ్చింది అర్థం కావట్లే.. రామ్‌ చరణ్‌కి చెప్పకమ్మా!' అని చిరంజీవి అన్నారు. తాజాగా దీనికి సంబంధించిన అనసూయ ఓ పోస్ట్ చేస్తూ... హాహాహా... చాలా క్యూట్.. చాలా వినయం.. మెగా లెజెండ్‌ను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది' అంటూ ఎప్పటికీ చిరు ఫ్యాన్ అని ట్వీట్ చేసింది. అమితానందం వ్యక్తం చేస్తున్నట్లు, సిగ్గుపడుతున్నట్లు స్మైలీలు పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: