దాదాపు రెండేళ్ళ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. 2018 తర్వాత ఆయన సినిమా ప్రేక్షకుల ముందుకి రాలేదు. దాదాపు రెండేళ్ళ తర్వాత సినిమా రావడంతో ఆ సినిమాకు ఇప్పుడు ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది. రాజకీయంగా ఈ మధ్య ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యారు. వరుసగా సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పింక్ రీమేక్ గా వస్తున్న తాజా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. 

 

ఇప్పటికే సినిమాలో సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసారు. ఈ సినిమా టైటిల్ ని వకీల్ సాబ్ గా ఖరారు చేసారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో వస్తూన ఈ సినిమా లుక్ ని తాజాగా విడుదల చేసారు. ఈ లుక్ ఇప్పుడు కొంత మందికి నచ్చింది కొంత మందికి నచ్చలేదు. దీనితో సోషల్ మీడియా లో కొందరు సినిమా కచ్చితంగా ఫ్లాప్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ను శ్రద్ధ తో చేయడం లేదని అంటున్నారు. అటు రాజకీయాలు ఇటు సినిమా మీద రెండు పడవ ల మీద కాలు వేస్తున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు. 

 

సినిమా మరో అజ్ఞాతవాసి అవుతుంది అంటూ కొందరు కామెంట్ చేయడం గమనార్హం. ఇక ఈ సినిమా మీద ఇప్పటికే భారీగా మార్కెట్ జరుగుతుంది. ఈ సమయంలో వస్తున్న ఈ కామెంట్స్ సినిమాను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అసలే రెండేళ్ళ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రచారం ఎందుకు అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ను దిల్ రాజు బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవి తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రావడం ఖాయం. ఏది ఏమైనా ఈ సినిమాపై టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: