కుర్ర హీరో నితిన్.. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనిఅందరికీ తెలిసిందే. వరుసగా తన సినిమాలు ఫ్లాప్ అవుతున్న సమయంలో డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వంలో నటించిన ‘ఇష్క్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ని అతిధి గా తెచ్చుకొని ఆ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అప్పటినుండి మెగా అభిమానులకు దగ్గరైనా నితిన్ తన సినిమాలలో ఏదో ఒక సన్నివేశంలో మెగా కాంపౌండ్ ని టచ్ చేసే విధంగా డైలాగ్ కానీ సీన్ గాని ఉండేలా చూసుకుంటాడు. మెగా హీరోలకు ఎంతో దగ్గరగా ఉండే నితిన్ ఇటీవల 'భీష్మ' సినిమా ద్వారా అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో విశాఖపట్టణంలో సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ చాలా గ్రాండ్ గా చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ గా మారినట్లు సమాచారం.

 

విషయంలోకి వెళితే 'భీష్మ' సినిమా సక్సెస్  కార్యక్రమానికి వచ్చిన వరుణ్ తేజ్ మాట్లాడుతూ...నితిన్ తనకి మంచి బెస్ట్ ఫ్రెండ్ అని కానీ రెండు విషయాల్లో మోసం చేశాడు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. నితిన్ సింగిల్ అని చెబుతూనే మొదటి రీల్ అయ్యే లోపే అమ్మాయిని పడేశాడని ఆ విషయంలో మనల్ని మోసం చేశాడని వరుణ్ ఫన్నీ కామెంట్ చేశాడు. అంతేకాదు సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టేయడమే గాక పెళ్లి కుదిర్చేసుకున్నాడని ఇది కూడా మరో మోసం లాంటిదేనని వరుణ్ ఫన్ క్రియేట్ చేశాడు. బ్యాచిలర్ గా ఉంటా అంటూ మాట్లాడుతూ సినిమా విడుదలకు ముందే ఎంగేజ్మెంట్ కానీ చేశాడని మమ్మల్ని అందరినీ మోసం చేశాడని వరుణ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఏదిఏమైనా ఫ్రెండ్ కాబట్టి ఒక ఇంటి వాడు అవుతాడు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అని నవ్వేశాడు. అయితే వరుణ్ తేజ్ చేసిన కామెంట్లు పట్ల సోషల్ మీడియాలో నితిన్ ఫ్యాన్స్ కొంత హర్ట్ అయ్యారట.  పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు ఈ విధంగా పబ్లిక్ సమావేశంలో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ అభిమానులు కూడా రియాక్ట్ అయ్యి నితిన్ ఫ్యాన్స్ కి కౌంటర్లు వేస్తున్నారట. ఫ్రెండ్ కాబట్టి చనువు ఉంది కాబట్టి వరుణ్ మాట్లాడాడు అంటూ నితిన్ ఫ్యాన్స్ కి రిప్లై ఇస్తున్నారు అంట. దీంతో సోషల్ మీడియా లో వరుణ్ తేజ్ ఫ్యాన్స్‌ vs నితిన్ ఫ్యాన్స్‌ అన్నట్టుగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: