సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్ని రోజులుగా రోజూ వార్తల్లో నిలుస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా యాభై రోజులు పూర్తి చేసుకున్న ఆనందంలో ఉన్న మహేష్ కి తన తర్వాతి చిత్ర విషయమై ఆలోచనలో ఉన్నాడట. సరిలేరు తర్వాత వంశీ పైడిపల్లి తో సినిమా ఉంటుందని ప్రకటించిన మహేష్... ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ అయిందని తెలిపి షాకిచ్చాడు. ఇది వంశీకే కాదు ప్రేక్షకులకి కూడా పెద్ద షాకే..

 

 

అయితే మహేష్ అభిమానులు వంశీతో సినిమా క్యాన్సిల్ అయినందుకు ఆనందిస్తున్నారని టాక్. మహర్షి సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అయినప్పటికీ దానిపట్ల ప్రేక్షకులు మిశ్రమ స్పందన తెలియజేసారు. అదంతా పక్కన పెడితే ప్రస్తుతానికి వంశీతో సినిమా క్యాన్సిల్ అయింది. మరో దర్శకుడి వేటలో మహేష్ పడ్డాడని అందరికీ తెలిసిందే. గీత గోవిందం సినిమాతో తనని తాను నిరూపించుకున్న పరశురామ్ తో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు.

 

 

 

ఈ నేపథ్యంలో మహేష్ తన సినిమా గురించి కొన్ని అంచనాలు పెట్టుకున్నాడట. భరత్ అనే నేను, శ్రీమంతుడు, మహర్షి వంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు తీసిన తర్వాత ఈ సారి ఏదైనా పక్కా ఎంటర్ టైనర్ చేద్దామని భావిస్తున్నాడట. మళ్ళీ మళ్ళీ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు తీస్తే ఒకే మూసలోకి వెళ్ళీ ప్రేక్షకులకి బోర్ కొట్టే ప్రమాదం ఉందని భావించిన మహేష్ ఈ నిర్ణయానికి వచ్చాడు. అయితే పక్కా ఎంటర్ టైనర్ అనగానే మనకు గుర్తొచ్చే మహేష్ సినిమాలు చాలానే ఉన్నాయి.

 

 

అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు అతడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో అనుకున్నంతగా ఆడకపోయిన బుల్లితెర మీద దీని సందడి మామూలుగా లేదు. ఇప్పుడు మళ్ళీ మహేష్ అతడు లాంటి సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడట. మరి అలాంటి సినిమాన్ను తెరకెక్కించే దర్శకుడెవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: