రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ తన తర్వాతి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు తన తర్వాతి సినిమా చేయడానికి రెండు సంవత్సరాలకి పైగా సమయం తీసుకుంటున్నాడు. అయితే అ గ్యాప్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అదంతా పక్కన పెడితే ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా తీస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

 

 

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ రివేంజ్ డ్రామాలో అల్లు అర్జున్ లుక్ చాలా ఫ్రెష్ గా ఉంటుందట. ఇప్పటి వరకు బన్నీ మనం చూడని విధంగా సుకుమార్ చూపిస్తున్నాడట. రంగస్థలంలోనూ రామ్ చరణ్ ని చూసి షాక్ తిన్నట్టుగా ఈ సినిమాలోనూ బన్నీని చూసి షాక్ తింటారట. అయితే ప్రస్తుతం బన్నీ అల వైకుంఠపురములో సినిమా విజయంతో కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ సుకుమార్ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు.

 

ఇప్పటికే దానికి సంబంధించిన లుక్ లోకి వచ్చాడట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు. మొదట్లో పూజా హెగ్డేని తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండడం ఇంకా సుకుమార్ రాసుకున్న పాత్రకి ఆమె సరిపోదేమో అని భావించి వద్దనుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి అమ్మాయి దొరికేసిందని అంటున్నారు.

 


పల్లెటూరి అమ్మాయి పాత్రలో రష్మిక మందన్నని ఫోటో షూట్ చేశారట. ఆ ఫోటోలని చూసిన సుకుమార్ ఆ పాత్రకి రష్మిక పర్ ఫెక్ట్ గా సరిపోతుందని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ, రంగస్థలం లో సమంత లాగే ఈ సినిమాలో రష్మిక పాత్ర ఉంటుందని అంటున్నారు. మరి అధికారిక నిర్ణయం వెలువడితే కానీ హీరోయిన్ ఎవరనే విషయం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: