కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న యంగ్ హీరో రానా తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత అరణ్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన రానా ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లతో పాటు టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ క్యాంపెయిన్ను స్టార్ట్ చేశారు రానా. పర్యావరణాన్ని అడవులను కాపాడాలనే సందేశంతో అరణ్య సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమా ప్రమోషన్లో భాగంగా ఎకో ట్రైబ్ (#EcoTribe) పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ లో మూడు మొక్కలు నాటి ఆ వీడియోను పోస్ట్ చేశాడు రానా.
అంతేకాదు ప్రతీ ఒక్కరి అలా మూడు మొక్కలు నాటి ఆ వీడియోను #EcoTribe హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరాడు. క్యాంపెయిన్లో భాగంగా మరోకరిని నామినేట్ చేయాలని కోరాడు రానా. ఇక సినిమా విషయానికి వస్తే ఒకప్పటి బాలీవుడ్ క్లాసిక్ హాథీ మేరి సాథీ సినిమాకు రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో రానా అడవి మనిషిగా కనిపించనున్నాడు.