అత్తారింటికి దారేది సినిమా చూసే ఉంటారు కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన ఈ సినిమా లో కీలక పాత్రలో నటించిన నటి నదియా. పవన్ కళ్యాణ్ కి అత్తగా ఆమె చేసిన పాత్రకు అప్పుడు మంచి మార్కులు పడ్డాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో ఆమె నటన ఎంతో ఆకట్టుకుంది. ప్రేక్షకులు నదియా హుందా తనం చూసి పొంగిపోయారు కూడా. చాన్నాళ్ళకు మంచి పాత్రకు ఒక మంచి నటి దొరికింది అన్నారు. ఆ తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. 

 

అగ్ర దర్శకులు కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా కనుమరుగు అయిపోయారు. తనకు డిమాండ్ ఉందని అనుకున్నారో లేక మరేదైనా కారణమో తెలియదు గాని హీరోయిన్ తో సమానం గా ఆమె పారితోషకం తీసుకున్నారు. దీనితో ఆమెను భరించలేం బాబోయ్ అన్నారు నిర్మాతలు. ఇక ఆమె కూడా డేట్స్ విషయంలో కాస్త అతి చేసారు అనేది టాలీవుడ్ జనాల మాట. ప్రతీ సారి ఆమె తనకు నచ్చిన టైం లో షూటింగ్ కి వచ్చే వారు అనే ఆరోపణలు ఎక్కువగానే అప్పట్లో వినిపించాయి. 

 

ఇప్పుడు నదియా తమిళంలో సినిమాలు చేస్తున్నారు. అయినా సరే ఆమెకు తెలుగులో వచ్చిన గుర్తింపు అక్కడ రావడం లేదు. మంచి నటిగా పేరున్నా సరే ఆమె తెలుగులో వచ్చిన గుర్తింపు ని కాపాడుకోలేకపోయారు. ఆమె తర్వాత వచ్చిన పవిత్రా లోకేష్ సహా కొంత మంది మాజీ హీరోయిన్లు మంచి పాత్రలు చేస్తూ నిలబడ్డారు. ఆమె మాత్రం వచ్చిన అవకాశాలను వాడుకోవడంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె దర్శకులను ఇబ్బంది పెట్టడంతోనే తెలుగులో ఆమెను పక్కన పెట్టారు అంటున్నారు కొందరు. ఇక ఆమె తెలుగులోకి వచ్చే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: