బాహుబలి సినిమాకు ముందు వరకు రమ్యకృష్ణ సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్, టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ సినిమా వచ్చాక ఇప్పుడు శివగామి పాత్ర ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు బాహుబలి సినిమా చూసిన వాళ్లు అందరికి శివగామి రోల్ అలా మనసులో పడిపోయింది. ఆ పాత్రలో అంతలా ఆమె ఒదిగిపోయింది. అత్తగాను, అమ్మగాను.. ఆంటీగాను. తోటి కోడలిగాను, భార్య గాను, ప్రేయసి గాను ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రల ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా తెలుగుతో పాటు సౌత్లో అన్ని భాషల ప్రేక్షకుల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసిన రమ్యకృష్ణ బాహుబలి సినిమాతో తాను అంతర్జాతీయ స్థాయి నటిని అన్న విషయం ఫ్రూవ్ చేసుకుంది.
ఇక ఇప్పుడు మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ శివగామి దేవి అత్తగా మారుతున్నారు. అది కూడా ఓ స్టార్ డైరెక్టర్ కొడుకుకు. అయితే ఇదంతా రియల్ లైఫ్లో కాదు రీల్ లైఫ్లో మాత్రమే సుమా. అనిల్ పాదూరి దర్శకత్వంలో పూరి తనయుడు ఆకాష్ హీరోగా పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం రొమాంటిక్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు కు చేరుకున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ సినిమాను మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ రొమాంటిక్లో రమ్యకృష్ణ హీరోయిన్ కు అమ్మగా నటిస్తోందట. అంటే హీరోకు అత్త రోల్ అన్న మాట. అంటే సినిమాలో ఆకాష్ పూరికి అత్తగా కనిపించబోతుంది అన్నమాట. గతంలో రమ్యకృష్ణ ఎన్టీఆర్ కి అత్తగా కనిపించి అలరించింది. నా అల్లుడు సినిమాలో జెనీలియా, శ్రియల ముద్దుల అమ్మగా నటించి మెప్పించింది. అలాగే నాగచైతన్యకి శైలజారెడ్డి అల్లుడు సినిమాలో ఇమ్మాన్యుయేల్ అమ్మగా.. చైతు అత్తగా నటించింది. ఇక అల్లరి నరేష్ కు కూడా రమ్యకృష్ణ అత్తగా నటించింది. ఇప్పుడు ఆకాష్ పూరి వంతు వచ్చింది.