బండ్ల గణేష్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై తన కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ తర్వాత చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తూ వచ్చారు.  కాలం కలిసి వచ్చి నిర్మాత స్థాయికి ఎదిగాడు.  నిర్మాతగా మంచి ఫామ్ లో ఉన్న బండ్ల గణేష్ కి పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో అప్పటి నుంచి ఆయనకు పరమ భక్తుడిగా మారిపోయారు.  ఎక్కడైనా.. ఎప్పుడైనా పవన్ పేరు చెబితే చాలు నా దేవుడు అంటారు.  ఏ హీరో ఈవెంట్స్ లో అయినా సరే ఒక్కసారి ఆయన తన దైవం పవన్ కళ్యాన్ ని గుర్తుకు చెసుకొని జై పవన్ అంటుంటారు. 

 

మెగా హీరోలతో బండ్ల గణేష్ కి అంత ఆత్మీయ అనుబంధం ఉంది.   ఆ మద్య తెలంగాణలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన ఆ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో పార్టీకి గుడ్ బాయ్ చెప్పి ఇప్పుడు మళ్లీ వెండ తెరపై రాణించేందుకు సిద్ద అయ్యారు.  ఇప్పటికే అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ లో నటించి నవ్వించారు.  తాజాగా పవన్ కల్యాణ్‌ చిత్రానికి   బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ ఎవరు?' అంటూ ట్విట్టర్‌లో ఒకరు నిర్వహించిన పోల్‌లో తనకు చాలా మంది ఓటు వేయడంతో నిర్మాత బండ్ల గణేశ్ హర్షం వ్యక్తం చేశారు.

 

ఎంత మంది ఎన్ని చెప్పినా.. ఎవరు ఏమన్నా నా దైవం పవన్ కళ్యాన్ అనే చచ్చే వరకు చెబుతా అని అన్నారు.  ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేస్తూ 'జై పవన్‌ కల్యాణ్‌' అని ట్వీట్ చేశారు. 'మీ అభిమానానికి కృతజ్ఞుడిని. ఎల్లవేళలా నా దైవానికి విశ్వాస పాత్రుడిని' అంటూ బండ్ల గణేశ్ పేర్కొన్నారు.  ఇందులో ఏఎం రత్నంకు 14 శాతం, బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు 8 శాతం, బండ్లగణేశ్‌కు 51 శాతం, దిల్‌ రాజుకు 27 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నిర్మాత బండ్ల గణేశ్ గతంలో ఎంతగా పొగడ్తల వర్షం కురిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: