టాలీవుడ్ లో అనిల్ రావిపూడి పేరు చెబితేనే ప్రస్తుతం ఓ సంచలనం. 2015లో కళ్యాణ్‌రామ్ పటాస్ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన అనిల్ రావిపూడి పటాస్, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస బ్లాక్‌బ‌స్టర్ సినిమాలతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. అనిల్ రావిపూడి చేసిన సినిమాలు ఒక దానికి మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనిల్ రావిపూడి చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా విజ‌యోత్స‌వ‌ సభలో అనిల్ రావిపూడి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు... మరో డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రశంసల వర్షం కురిపించాడు.



ఈ క్ర‌మంలోనే అనిల్ మాట్లాడుతూ తెలుగు సినిమా బ్లాక్‌బస్టర్ కా బాప్ రాఘవేంద్రరావుగారికి, కమర్షియల్‌కా బాప్ వినాయక్‌గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక కమర్షియల్ సినిమాని ఎలా తీయాలో రాఘ‌వేంద్ర‌రావుకే తెలుస‌న్న అనిల్‌... తాను డైరెక్ట‌ర్ అవ్వ‌డానికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది వివి. వినాయ‌క్ అని షాక్ ఇచ్చాడు. తాను గుంటూరులోని హ‌రిహ‌ర‌మ‌హాల్ థియేట‌ర్లో ఆది సినిమా చూస్తున్న‌ప్పుడు పిల్లోడు రెండు బాంబులు వేయగానే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం  వి.వి.వినాయక్ అని స్క్రీన్ మీద పడుతుంది. అప్పుడు థియేట‌ర్ అంతా విజిల్స్‌తో మార్మోగిపోతుంద‌ని.. అప్పుడు త‌న గూస్‌బంప్స్ వ‌చ్చాయ‌ని అనిల్ చెప్పాడు.



అనిల్ ప్ర‌శంస‌లు ఎలా ఉన్నా .. వినాయ‌క్ ఇప్పుడు వ‌రుస ప్లాపుల్లో ఉన్నాడు. అత‌డు డైరెక్ష‌న్ మానేసి.. ఇప్పుడు శీన‌య్య సినిమాతో హీరో అవ‌తారం ఎత్తాడు. అస‌లు అత‌డికి సినిమా ఛాన్సులు ఇచ్చేందుకు కూడా హీరోలు వెన‌కాడ‌డం కాదు క‌దా.. అస‌లు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. అలాంటి వినాయ‌క్‌ను ఇప్పుడు రాఘ‌వేంద్ర‌రావు లాంటి డైరెక్ట‌ర్ ప‌క్క‌న ఉన్నా కూడా ఆయ‌న కంటే మ‌రీ పొగిడేసి ఆకాశానికి ఎత్తేయ‌డంతో అనిల్ మాట‌లు విన్న‌వాళ్లంతా మ‌రి ఇంత చేశాడంట‌ని చ‌ర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: